పవన్ కల్యాణ్ కు మహా సీఎం పరామర్శ.!

Publish Date:Jul 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇటీవల ముంబైలోని  కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో   భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ పూర్తయిన అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు కోకిలాబెన్ ఆస్పత్రికి క్యూకడుతున్నారు. అలా  పరామర్శకు వచ్చిన వారిలో జాతీయ స్థాయి నేతలు కూడా ఉండటం..  దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు దర్పణం పడుతోంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కోకిలాబెన్ హాస్పిటల్‌కు విచ్చేసి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు.

హాస్పిటల్‌కు చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్‌తో చాలా సేపు భేటీ అయ్యారు. సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడి ఆయన ఆరోగ్యపరిస్థితిని ఆరా తీశారు.  పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సుహృద్భావ పూరిత వాతావరణంలొ చర్చలు జరిగాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని  సాధించి రికార్డు సృష్టించింది.

పవన్ కళ్యాణ్ చేసిన ఆనాటి ఎన్నికల ప్రచారం, చూపి ప్రభావానికి కృతజ్ఞతగా, ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి పరామర్శించారు.  సర్జరీ నిమిత్తం ముంబై హాస్పిటల్లో చేరిన ఆయనను కలవడానికి కాగా తనను  పరామర్శించడానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలిపారు.   

 Pawan Kalyan, Devendra Fadnavis, Pawan Kalyan Surgery, Mumbai Kokilaben Hospital, Chandrababu Naidu, Maharashtra CM Meets Pawan Kalyan

By
en-us Political News

  
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
అమెరికాలో ఏఐ కంపెనీల సంపద పంపిణీపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. కంపెనీల స్టాక్‌లో 50 శాతం వాటాను పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు 69% మంది ప్రజలు మద్దతు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సబ్‌స్క్రైబర్లలో భారీ మార్పు! మొదటి సీజన్ తర్వాత 70 శాతానికి పైగా వ్యూయర్స్ షోలను ఎందుకు వదిలేస్తున్నారో బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
భారతదేశంలో యూపీఐ UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ MDR ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.2,000 దాటిన లావాదేవీలపై గరిష్టంగా 0.5 శాతం కంటే తక్కువ ఛార్జీ విధించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మరియు దీనివల్ల ఎవరిపై ప్రభావం పడుతుందో ఇక్కడ చదవండి.
ఆసుపత్రిలో చేరినప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులభంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా సెటిల్ అవ్వడానికి అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ వరకు పాటించాల్సిన 10 అద్భుతమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.