టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హిట్ మెన్ రోహిత్ శర్మకు పొమ్మనలేక పొగ.!?

Publish Date:Jul 18, 2026

Advertisement

హిట్ మన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన వార్తలు  క్రికెట్ ప్రపంచంలో  తీవ్ర దుమారం రేపుతున్నాయి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే మ్యాచ్ వేదికగా హిట్ మ్యాన్  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడన్న ప్రచారంజోరుగా సాగుతోంది. ఆదివారం (జులై 19) లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు  అయితే  ఇది  రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా  పొమ్మనలేక పెడుతున్న పొగా  అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి. 

కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ సోషల్ మీడియా కథనాల ప్రకారం..   2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుకుంటుంది. ఇంతటి సుదీర్ఘ కాలం పాటు అతడు వన్డే ఫార్మాట్‌లో కొనసాగడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.   అందుకే భవిష్యత్తు జట్టు నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా భావిస్తున్నారు.  వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్  ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటే మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనట్టే అవుతుంది. ఈ నేపథ్యంలోనే..  రోహిత్ శర్మ కెరీర్‌లో లార్డ్స్ లో ఆదివారం (జులై 19) జరిగే మ్యాచే చివరి మ్యాచ్ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఇప్పటికే పలు సందర్భాలలో  2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే బలమైన ఆకాంక్షను రోహిత్ వ్యక్తం చేశాడు. అయితే అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ పొమ్మనలేకపోగపెడుతున్నట్లుగా కనిపిస్తోందని రోహిత్ అభిమానలు అంటున్నారు. అయితే రోహిత్ శర్మ రిటైర్ మెంట్ కు సంబంధించి అతడి నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.  

Rohit Sharma retirement rumours, Lords ODI match, Gautam Gambhir planning, 2027 ODI World Cup, BCCI selection updates, Indian cricket team news

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.