నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి తీరని నష్టమేనా?

Publish Date:Dec 16, 2024

Advertisement

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి తీరని నష్టం, అన్యాయం వాటిల్లనుంది. లోక్ సభ వేదికగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జరిగిన చర్చో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ విషయంపై బలంగా తన గళం వినిపించారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి తీరని అన్యాయం వాటిల్లనుందని ఆయన చెప్పారు. అది నిజమే. జనాభా ప్రాతిప్రతికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాదిలో 155 లోక్ సభ స్థానాలు పెరుగుతుంటే.. దక్షిణాదిన మాత్రం కేవలం 34 స్థానాలు మాత్రమే పెరుగనున్నాయి.  నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లలో ఇప్పుడున్న 174 ఎంపీ సీట్లు 329కు పెరిగే అవకాశం ఉంది. అంటే ఆ రాష్ట్రాలన్నీ కలిపి అక్కడ 155 సీట్లు పెరుగనున్నాయి. 

అదే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో సీట్లు 129 నుంచి 164కు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఐదు రాష్ట్రాల్లో కలిపి కేవలం 35 సీట్లు మాత్రమే పెరుగుతుంటే.. ఉత్తరాదిలో మాత్రం నాలుగు రాష్ట్రాలకు కలిపి 155 స్థానాలు పెరుగుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇది  సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.  ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలకు రాజకీయంగా ప్రయోజనం కల్పించడమే అవుతుందనడంలో సందేహం లేదు. ఈ అన్యాయాన్ని సరిదిద్ది, దక్షిణాది రాష్ట్రాలకూ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  

ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే కాదు.. కుటుంబ నియంత్రణ అమలు విషయంలో కూడా ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇసుమంతైనా లెక్క చేయలేదు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణ విషయంలో ముందువరుసలో నిలిచాయి. ఇప్పుడు అదే ఆ రాష్ట్రాలకు శాపంగా మారింది. దేశ ప్రయోజనాల కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కుటుంబ నియంత్రణను పాటించడంలో ముందున్న దక్షాణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది.  అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి దక్షిణాది రాష్ట్రాల నాయకులు  ఒక్కరు లేక ఇద్దరు చాలు అన్న నినాదాన్ని పక్కన పెట్టేసి ఎక్కువ మంది పిల్లలను కనండి అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరగాలని కోరుకుంటున్నారు.  ఎందుకంటే.. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుంది. నియోజకవర్గాల విభజనలో కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటింది, జనాభా పెరుగుదల నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనలో గణనీయంగా నష్టపోనున్నాయి. భారీగా నియోజకవర్గాలను కోల్పోనున్నాయి. 

ఎందుకంటే.. ఉత్తరాదిలో జనాభా పెరుగుదల రేటు దక్షిణాదితో పోలిస్తు  కంటే ఎక్కువగా ఉంది.  జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల   విభజనతో ఉత్తరాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. ఆ మేరకు దక్షిణాదిలో తగ్గిపోతాయి. అంటే దక్షిణాది వాయిస్ జాతీయ స్థానియలో బలహీన పడుతుంది.  ఇప్పటికే దక్షిణాది పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న భావన దక్షిణాది రాష్ట్రాలలో బలంగా ఉంది.  

ఉత్తరాది,దక్షిణాది ల మధ్య జనాభా పెరుగుదల రేటులో వత్యాసం ఉండటానికి కారణం  కుటుంబనియంత్రణ దక్షిణాది రాష్ట్రాలలో ఖచ్చితంగా,సమర్దవంతంగా అమలుచేయడమే.  ఒకప్పుడు "ఇద్దరైతే ముద్దు..ఆపై వద్దు" ఒక్కరు లేదా ఇద్దరు చాలు అనే కుటుంబనియంత్రణ నినాదం జనంలోకి బలంగా వెళ్లింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు అందుకు కట్టుబడ్డారు.   తమ ఆర్ధిక పరిస్థితి మేరకు చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని భావించి కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించారు.  . పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దక్షిణాది కుటుంబాలు ఒకరిద్దరు పిల్లలో సరి పెట్టుకుని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకాలూ, ఆర్థిక సమస్యలూ ఎదురు కాకుండా చూసుకున్నారు.  
సాధారణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జనాభా నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేలా చర్యలు ఉండాలి. కానీ జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. అదే మాదిరిగా కేంద్రం నిధుల కేటాయింపులూ ఉంటున్నాయి. అంటే ఎక్కువ జనాభా ఉంది కనుక ఎక్కువ నియోజకవర్గాలు ఉత్తరాదికి. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పేదరికం ఎక్కువగా ఉంది.. అందుకు కేటాయింపులలో అధిక భాగం ఉత్తరాదికే అన్నట్లుగా పరిస్థితి ఉంది.  ఇది దారుణం. ఈ అన్యాయాన్ని సరిదిద్దకుంటే.. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది మధ్య ఉన్న అంతరం మరింత పెరిగి అంతర్యుద్ధానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు.  

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.