దీర్ఘ మేర ఆరోగ్య మ(శి)స్తు!!

Publish Date:Dec 20, 2021

Advertisement

జీవితంలో ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం మంచిగా లేకపోతే సంపాదించుకున్నది అంతా మనల్ని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేనా ఆరోగ్యం సరిగా లేకపోతే సంపాదన  మొత్తం హాస్పిటల్స్ కు, డాక్టర్స్ కు శిస్తు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పట్లో రోగం లేని మనిషి అంటూ లేడు. బీపీలను, షుగర్లను వెంట పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు మనుషులు. ఒకప్పుడు జబ్బులనేవి తక్కువ. నిజానికి జీవితం ఖరీదు అవుతుంటే జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కటీ ఎంతో ఖర్చుతో సమకూర్చుకోవలసి వస్తుంది. అందుకే బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఆరోగ్య సమస్యలు అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉన్నాయి. 

 ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి?? 

గత యాభై సంవత్సరాలు ఇంకా కనీసం పది, ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే జనాబాకు జబ్బుల దాడి ఎక్కువయ్యింది. అదేనండి సమస్యలు ఎక్కువ అయ్యాయి. కారణం ఏమిటి అని ఆలోచిస్తే వ్యవసాయ పంటలలో  పోషణ తగ్గింది. పెద్దలు చెబుతూ ఉంటారు ఒకప్పుడు గింజలు, విత్తనాల రుచి వేరు అని. అది నిజమే కావచ్చు. సేంద్రీయ వ్యవసాయం నుండి పురుగుమందులు ఉపయోగించి పంటలు పండించడం వల్ల రుచి తగ్గిందనేమాట వాస్తవం. అయితే ఇది కాకుండా మరొకటి ఉంది. అదే పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం. 

పొరుగింటి పుల్లకూర రుచి!!

ఓకేప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకేరకమైన వాతావరణంలో ఉంటారు. పొరుగింటి పుల్లకూర తిన్నా పర్లేదు ఏమీ కాదు. విదేశాలు పూర్తిగా భారతదేశ వాతావరణానికి భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణం, అక్కడ పండే పంటలు వారు తింటారు. అయితే అవి తెచ్చి ఇక్కడ తినడం వల్ల వస్తున్నవే ఆరోగ్య సమస్యలు. వారు అక్కడ వాడే పదార్థాలు వారికి దొరికే స్వఛ్చమైనవి అయి ఉండచ్చు, కానీ అవి ఇక్కడికి పచ్చేసరికి  50% పైగా కలుషితం అవుతాయి. వాటి మీద లేబుల్స్ మెరుస్తూ, మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు అతికిస్తూ విదేశీ ఫుడ్ ఎంతగానో జనాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్యాకింగ్ ఫుడ్స్ ను ఇన్స్టంట్ ఫుడ్స్ ను పరిచయం చేసింది విదేశీ వ్యాపారాలే. నిజానికి విదేశాలలో కూడా జీర్ణసంబంధ సమస్యలు, పేగు క్యాన్సర్లు ఎక్కువ. కారణం వారు తినే ఆహారం, వారి అలవాట్లు కూడా. 

అవసరాలు, ఆహారం అయ్యో!! అయ్యో!!

చాలా ఇళ్లలో ఆహారం విషయంలో అయినా నిర్లక్ష్యం చేస్తారు కానీ అవసరాలు తీర్చుకోవడంలో మాత్రం అస్సలు తగ్గేది లేదు. నిజానికి ప్రతి కుటుంబంలో ఆహార ఆవశ్యకత గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పచ్చు. ఏ రోగమో, రొప్పో వచ్చినప్పుడు మందులతో ఆ రోగానికి  టెంపరరీ సొల్యూషన్స్ వెతుక్కోవడం, శరీర సామర్థాన్ని  రోజు రోజుకూ దిగజార్చుకోవడం, అలా ఆరోగ్యాన్ని ఖూనీ చేసుకునే లెజెండ్స్ ఎక్కువయ్యారని చెప్పచ్చు. మన భారతదేశానికి మహర్షులు ప్రసాదించిన ఆయుర్వేదాన్ని కాదని చిటికెలో తలనొప్పులు, గొంతు గరగరలు తగ్గించే ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడి జీవితకాలన్ని తగ్గించుకుంటున్నారు. 

అందుకే జీవితంలో సంపాదించే దానిలో మొదట ఆహారం కోసం ఎక్కువ మొత్తం వెచ్చిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పటి కాలంలో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆయుర్వేదంలో సూచించబడిన ఎన్నో అద్భుత మొక్కలను రోజువారీ సమస్యలలో ఉపయోగించవచ్చు. పలితం శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.  లేదూ సరిపడని తిండి, వ్యతిరేకమైన అలవాట్లు ఫాలో అవుతామని అంటే అలాగే కానివ్వండి. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోల్పోయి దానికి శిస్తు కడుతూ శిక్ష అనుభవిస్తారు తప్పనిసరిగా!!


◆ వెంకటేష్ పువ్వాడ


 

By
en-us Political News

  
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.