Publish Date:Apr 30, 2026
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది. ప్రభుత్వ వైద్యరంగంలో అరుదుగా జరిగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా పూర్తి చేసి మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం.... గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ అనే అరుదైన వ్యాధితో బాధపడు తున్న కేవలం 18 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఈ క్లిష్ట శస్త్రచికిత్స చేపట్టారు. సుమారు పది కిలోల బరువు మాత్రమే ఉన్న ఈ చిన్నారికి లివర్ మార్పిడి చేయడం వైద్యపరంగా అత్యంత సవాలుతో కూడుకున్న పని. ఈ కథలో భావోద్వేగానికి హద్దులే లేవు. చిన్నారి తండ్రే తన లివర్లోని ఒక భాగాన్ని దానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. తండ్రి నుంచి సేకరించిన లివర్ భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిన్నారి శరీరానికి అమర్చారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యుల అనుభవం కలిసిన ఈ శస్త్రచికిత్స సుమారు 14 గంటల పాటు ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు విజయం సాధించారు...ఈ క్లిష్టమైన చికిత్స మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించడం పేద కుటుంబానికి పెద్ద ఊరటగా మారింది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి లివర్ ట్రాన్స్ప్లాంట్లు దేశవ్యాప్తంగా చాలా అరుదని నిపుణులు పేర్కొన్నారు. ఈ అద్భుత విజయంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య బృందాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రపంచస్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ విజయంతో వైద్యుల సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/liver-transplantation-success-at-osmania-hospital-36-218660.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.