సంతోషానికి చిట్కా!

Publish Date:Aug 28, 2017

Advertisement

 

చాలా రోజుల క్రితం ఓ భార్యాభర్తా ఉండేవారు. వాళ్లిద్దరూ ఉన్నంతలో చాలా సంతోషంగానే ఉండేవారు. కానీ ఆ సంతోషం ఎంత కాలం నిలుస్తుందో అని వాళ్లకి తెగ అనుమానంగా ఉండేది. ఈలోగా వాళ్లుండే ఊరికి ఒక సన్యాసి వచ్చాడని తెలిసింది. ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉంటాయని ప్రచారం జరిగింది. దాంతో తమ సమస్యను ఆ సన్యాసికే విన్నవించుకోవాలని దంపతులిరువురూ బయల్దేరారు.

దంపతుల సమస్య విన్న సన్యాసి పెద్దగా ఆశ్చర్యపడలేదు. పైగా ‘‘నా దగ్గరికి అంతా డబ్బు కోసమో, కీర్తి కోసమో వస్తుంటారు. మీరు ఇలా సంతోషాన్ని కోరుతూ రావడం మంచిదే! అయితే ఇదేమంత తేలికగా నెరవేరే కోరిక కాదు. ఈ ప్రపంచంలో ఎవరైతే సంతోషంగా ఉంటారని మీకు అనిపించిందో వారి దగ్గరకు మీరు వెళ్లండి. ఆ వ్యక్తి వేసుకున్న చొక్కాలో ఒక ముక్క చించి మీ చేతికి చుట్టుకోండి. దాంతో మీరు చిరకాలం సంతోషంగా జీవిస్తారు,’’ అని చెప్పుకొచ్చాడు.

సన్యాసి మాటలు విన్న దంపతులు ‘ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవారు ఎవరా!’ అని వెతుక్కుంటూ బయల్దేరారు. అలా వారు ఒకో ప్రాంతం దాటుకుంటూ ‘దగ్గరలో ఎవరన్నా సంతోషంగా ఉన్నారా!’ అని వాకబు చేసుకుంటూ ఊరూరా తిరగసాగారు.

ఒక చోటకి వెళ్లేసరికి ‘ఫలానా జమీందారు దంపతులు చాలా సంతోషంగా ఉంటారని’ అందరూ చెప్పుకోవడం వినిపించింది. వెంటనే దంపతులు ఆ జమీందారు వద్దకు వెళ్లారు. వాళ్ల మాటలు విన్న జమీందారుగారి భార్య ‘‘మేం నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే... కాకపోతే ఓ చిన్న లోటు. మాకు పిల్లలు లేరు. ఆ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లలా మా మనసులు నిరాశలో మునిగిపోతాయి,’’ అంటూ ఒకింత బాధగా చెప్పుకొచ్చింది.

ఆ మాటలు విన్న భార్యాభర్తలు ఉస్సూరుమంటూ తమ యాత్రని కొనసాగించారు. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారికి ‘ఫలానా చోట ఉండే ఓ రైతు చాలా సంతోషంగా ఉంటాడని’ తెలిసింది. వెంటనే ఆ రైతు ఇంట్లోకి ప్రవేశించారు. వారి మాటలు విన్న రైతు ‘నిజంగానే మేం చాలా సంతోషంగా ఉంటాము. కాకపోతే ఒకటే సమస్య. మాకు గంపెడు సంతానం. వారందరినీ సంభాళించలేక ఒకోసారి జీవితం అంటే విరక్తి కలుగుతుంది,’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ రైతు.

రైతు మాటలు విన్న దంపతులు మరోసారి నిరాశపడ్డారు. ఇక ‘సంతోషంగా ఉండే మనిషిని కనుక్కోవడం అసాధ్యం!’ అనుకొని తిరుగుముఖం పట్టారు. దారిలో వారికి ఒక గొర్రెల కాపరి కనిపించాడు. మైదానంలో గొర్రెలని మేపుకుంటూ, పాటలు పాడుకుంటూ గంతులు వేస్తున్న అతన్ని చూసి దంపతులకి అతను చాలా సంతోషమైన మనిషని తోచింది. వెంటనే అతని దగ్గరకు వెళ్లి- ‘నువ్వు చాలా సంతోషంగా ఉంటావా!’ అని అడిగారు.

‘ఓ! నాకు దుఃఖం అనేదే లేదు. జీవితంలో ఏది లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించి తృప్తి పడుతూ ఉంటాను. జీవనం ముందుకు సాగేందుకు నా వంతు ప్రయత్నంలో ఎప్పుడూ లోటు రానివ్వను. నాకు అవసరం లేనిదాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోను. పక్కవాడిని చూసి నా జీవితం కూడా అలా ఉండాలని పోల్చుకోను,’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘మంచిది. మరేమనుకోకుండా నీ చొక్కాలోంచి ఒక ముక్క చించి నాకు ఇవ్వగలవా!’ అని అడిగరు దంపతులు.

ఆ మాటలకి గొర్రెలకాపరి నవ్వుతూ ‘నాకు అసలు చొక్కానే లేదు కదా! ఉన్నదల్లా ఓ కంబళి ఒకటే. దాన్ని చించేస్తే ఇక నాకు ఎండావానల నుంచి రక్షణ ఏది,’ అంటూ నవ్వుతూ తన దారిన తను వెళ్లిపోయాడు.

గొర్రెలకాపరి మాటలను మననం చేసుకుంటూ దంపతులు తమ గ్రామాన్ని చేరుకున్నారు. ఊళ్లోకి అడుగుపెడుతూనే వారు తమ సన్యాసి దగ్గరకు చేరుకుని జరిగిన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చారు. ‘నిత్యం సంతోషంగా ఉండే మనిషిని మేం కనుగొన్నాం. కాకపోతే మీరు సూచించినట్లుగా ఆయన చొక్కాలోంచి ఒక ముక్కని తీసుకుని రాలేకపోయాం,’’ అంటూ నిరాశగా చెప్పారు.

‘‘మీరు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారని నేను ముందుగానే ఊహించాను. తొడుక్కోవడానికి ఒక చొక్కా కూడా లేనివాడు సైతం సంతోషంగా ఉండగలడు అని నిరూపించడానికే మీకు ఆ లక్ష్యం ఏర్పరిచాను. మీరు నిత్యం మీ చెంత ఉంచుకోవాల్సింది అతని చొక్కా ముక్క కాదు. అతను చెప్పిన మాటలు. అవే మీకు సంతోషానికి మార్గంగా నిలుస్తాయి,’’ అని హితవు పలికాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


- నిర్జర.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.