Publish Date:Dec 24, 2019
విజయనగరం కలెక్టరేట్ సాక్షిగా మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం బయటపడింది. మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు... స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన బాధితులు... మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ ఆగడాలపై ఏకరువు పెట్టారు. మంత్రి బొత్స అండదండలు ఉన్నాయనే భరోసాతో తమ భూముల్లో బొత్స ఆదినారాయణ దౌర్జన్యంగా గోడలు కట్టారంటూ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. విజయనగరం జిల్లా జేసీ, ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాము మధ్యతరగతి కుటుంబాల వారమని, దాదాపు 40ఏళ్లు కష్టపడి విజయనగరం సత్యసాయినగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 53/4, 53/5లో స్థలాలను కొనుగోలు చేశామని... అయితే ఇఫ్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు బొత్స ఆదిబాబు ప్రయత్నిస్తున్నారంట కిరణ్, బి.రాజేష్, టీఏ సూర్యనారాయణ, అశోక్ కుమార్, వాసవి, పద్మావతి, గోవిందమ్మ తదితరులు దాదాపు 40మంది బాధితులు వాపోయారు.
సొంతిళ్లు కట్టుకోవాలని రూపాయి రూపాయి కూడబెట్టి స్థలం కొనుక్కుంటే ఇఫ్పుడు ఇలా కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా అధికార వైసీపీ నేతలే భూకబ్జాలకు పాల్పడుతుంటే తమ గోడు ఇంకా ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించి భూములు కట్టేశారని... అయితే, భూములకు సంబంధించిన అన్ని పత్రాలు, అనుమతులు తమ దగ్గర ఉన్నాయని అధికారులకు ఆధారాలు సమర్పించారు. తాము ఇల్లు కట్టుకోవడంలో ఆలస్యం కావడంతో ... తన అంగబలంతో మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ... ఆ స్థలం చుట్టూ గోడను నిర్మించారని బాధితులు వాపోతున్నారు. తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/land-grabbing-complaint-on-minister-botsa-satyanarayana-brother-25-92498.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.