ఇరుకున పడిన కాంగ్రెస్

Publish Date:Jun 26, 2015

Advertisement


ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్ళడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అనుమతి ఇచ్చారన్న ఆరోపణలు ఒకవైపు, దీనికి వసుంధరా రాజే సహకరించారన్న ఆరోపణలు మరోవైపు చేస్తూ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. మానవతా దృక్పథంతో చేసిన ఒక  సాయానికి రాజకీయ రంగు పులిమి, దీని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న  ఉద్దేశంలో కాంగ్రెస్ వుంది. ఎప్పుడు ఏ అంశాన్ని రాజకీయం చేద్దామా అని ఆశగా ఎదురుచూసే కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వదలకుండా తన శాయశక్తులా విమర్శలు చేస్తోంది. మన దేశంలో ఆర్థిక నేరాల్లో చిక్కుకుని విదేశాలకు వెళ్ళిపోయిన లలిత్ మోడీకి సుష్మా, వసుంధర సహకరించడం నేరం, ఘోరం అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అర్జెంటుగా వారిద్దరూ రాజీనామా చేస్తే తప్ప తమకు మనశ్శాంతి వుండదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే కోడల్ని తిట్టి అత్త మూకుడు నాకిందన్న సామెత చందంగా కాంగ్రెస్ పార్టీ గుట్టు ఒకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేలా చేసింది.

ఏ లలిత్ మోడీకి మానవతా దృక్పథంతో సహాయం చేయడం ఘోరమని అంటున్న కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలైన ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వధేరా ఎంచక్కా లండన్‌లో లలిత్ మోడీని కలిశారట. ఒక రెస్టారెంట్‌లో ఈ ముగ్గురూ ఎంచక్కా కబుర్లు చెప్పుకున్నారట. ఈ విషయాన్ని లలిత్ మోడీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేసింది. అసలు వీళ్ళిద్దరికి లండన్ వెళ్ళి లలిత్ మోడీని కలవాల్సిన అవసరమేంటనే ప్రశ్నకు కాంగ్రెస్ వర్గాల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దిగ్విజయ్ సింగ్ లాంటి భజనపరులు ప్రియాంకని, రాబర్ట్ వధేరాని వెనకేసుకు రావడానికి ప్రయత్నించినప్పటికీ అంతగా ప్రయోజనం వుండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీకి ఇది మంచి అవకాశంలా దొరికింది. ఈ ఒక్క పాయింట్ చూపించి కాంగ్రెస్‌ని తిప్పికొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.