ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది... ఒక యువకుడుపై దాడి చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రచ్చ రచ్చ సృష్టించింది. దీంతో బాధితుడు ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన హైదరాబాద్-- పంజాబ్ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ కాపర్తి (22) అనే నేను ఎల్.ఎల్.బి చదువుతున్నాను... నిన్న క్రికెట్ చూడ్డానికి ఉప్పల్ స్టేడియం వెళ్ళాను.
సుమారు రాత్రి 8: 45 గంటల ప్రాంతంలో స్టేడియం లోపల బార్ కౌంటర్ వద్ద కూర్చొని ఉన్న సమయంలో ఓ మహిళా బౌన్సర్ తన వద్దకు వచ్చి హల్ చల్ సృష్టించింది. దీంతో నేను (గౌతం) మొదటగా ఆశ్చర్యపోయాను. అనంతరం మొబైల్ ఫోన్ తీసుకొని ఆమె ప్రవర్తనను వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించాను. అది గమనించిన లేడీ బౌన్సర్ వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ ఆగ్రహంతో తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా తన చేతిలో ఉన్న ఫోన్ను బలవంతంగా లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయిందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన మొబైల్ ఫోన్లో వ్యక్తిగత సమాచారం, కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయని, ఫోన్ పోగొట్టుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నానని గౌతం తెలిపాడు. ఈ ఘటనపై దొంగతనం కేసు నమోదు చేయాలని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సంబంధిత మహిళ బౌన్సర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ గౌతమ్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా దానికి సంబంధించిన సాక్ష్యా లను కూడా పంపించాడు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lady-bouncer-attacks-young-man-at-uppal-stadium-36-219168.html
ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
ఈ లీగల్ బ్యాటిల్లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట్లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.