తమిళనాడు అసెంబ్లీలో కుప్పం ఎయిర్ పోర్టు ప్రస్తావన.. లింకేంటి?

Publish Date:Aug 13, 2026

Advertisement

ఏపీ సీఎం చంద్రబాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుు సాగుతున్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయతలపెట్టింది. అయితే కుప్పంలో ఏపీ ప్రభుత్వంనిర్మించతలపెట్టిన  విమానాశ్రయం  తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెంచింది. తమిళనాడుఅసెంబ్లీ వేదికగా హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన చర్చలో కుప్పం విమానాశ్రయం ప్రస్తావనకు వచ్చింది. 
తమిళనాడు శాసనసభ సమావేశాల సందర్భంగా డిఎంకె ఎమ్మెల్యే శ్రీనివాసన్ హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులోని హోసూరు సమీపంలో ఎయిర్‌పోర్ట్ రాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ    ఆరోపణలు చేశారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధితో పాటు పారిశ్రామిక పురోగతికి హోసూరు ఎయిర్‌పోర్ట్   కీలకమని, ఇతర రాష్ట్రాల వ్యూహాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు.

శాసనసభలో ఎడీఎంకే మ్మెల్యే   ఈ ఆరోపణలను  తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి   తోసిపుచ్చారు. హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును ఇతర పొరుగు రాష్ట్రాలేవీ అడ్డుకోవడం లేదంటూ.. సోషల్ మీడియా  ప్రచారాలనూ, నిరాధార వార్తలనూ నమ్మి అసెంబ్లీ వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి నిష్కర్షగా చెప్పారు.  హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి   ఆధారాలతో మాట్లాడాలన్నారు. అసలు కుప్పంలో విమానాశ్రయం, హోసూరు ఎయిర్ పోర్టులకు లింకేంటి?  కుప్పం విమానాశ్రయం గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరమేంటి? అంటే.. 
వాస్తవానికి హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు   పలు సాంకేతిక  సవాళ్లను ఎదుర్కొంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి హోసూరు అత్యంత సమీపంలో ఉంటుంది. విమానయాన నిబంధనల ప్రకారం ఒక ప్రధాన విమానాశ్రయానికి నిర్ణీత దూరంలో మరొక విమానాశ్రయాన్ని నిర్మించడంపై పరిమితులు ఉన్నాయి. దీనికితోడు హోసూరు ప్రాంతంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  పరిశోధనా కేంద్రాలు, సంస్థలు ఉండటం వల్ల  ఆ  పరిసరాల్లో విమానాల రాకపోకలపై  భద్రత దృష్ట్యా ఆంక్షలు  ఉన్నాయి. ఈ కారణాల వల్ల హోసూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వడానికి ముందు వెనుకలాడుతోంది. 
అయితే బెంగళూరుకు సమీపంలోనే నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ఎయిర్‌పోర్ట్   ప్రాజెక్టు కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది. దీంతో కుప్పం విమానాశ్రయ సాధ్యాసాధ్యాల అధ్యయనం జాప్యం లేకుండా పూర్తయ్యింది. 

కుప్పం వద్ద విమానాశ్రయం నిర్మాణం చేపడుతుండటంతో ప్రాజెక్టుకు దాదాపు 1,788 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1,300 ఎకరాల భూసేకరణను   పూర్తి చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్  నమూనాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విమానాశ్రయ నిర్మాణం, తదనంతర నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించేలా నిర్ణయం జరిగింది. 

కుప్పం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పరిసర సరిహద్దు ప్రాంతాల రూపురేకలు మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కుప్పం ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారడమే కాకుండా, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం పెరుగుతుంది.   స్థానిక రైతులకు, ఉద్యానవన పంటల సాగుదారులకు ఈ విమానాశ్రయం ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేయడానికి   దోహదపడుతుంది.

ఒకే భౌగోళిక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుప్పం విమానాశ్రయం అనుమతులు సాధించి పనుల్లో ముందంజ వేస్తుండగా..  హోసూరు ఎయిర్‌పోర్ట్  ప్రాజెక్టు పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదే తమిళనాడు రాజకీయాలలో కాకరేపుతోంది.   

Kuppam Airport, Tamil Nadu Assembly, Hosur Airport, Andhra Pradesh Infrastructure, Bengaluru Airport NOC

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.