అమరావతికి నో.. సీఆర్డీఏకి యస్..జగన్ వైఖరేంటి? విధానమేంటి?

Publish Date:Jul 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో  జగన్ మరోసారి మాట మార్చారు. వింత, వితండ వాదనను తెరపైకి తెచ్చారు. తాను రాజథాని అమరావతికి మాత్రమే నోఅన్నాను కానీ, సీఆర్డీయేను వ్యతిరేకించడం లేదంటూ.. రాజథాని విషయంలో తన అయోమయాన్నిగందరగోళాన్ని మరో సారి  బయటపెట్టుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇటీవల జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై ప్రజా క్షేత్రంతో పాటు సొంత పార్టీలోనే  వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. నష్టనివారణకు నడుంబిగించిన జగన్.. సీఆర్డీయేకు సై అంటూ తన గందరగోళాన్ని, స్థిరత్వం లేని విధానాన్ని మరోసారి చాటుకుని నవ్వుల పాలయ్యారు.  రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ  సిఆర్‌డిఏ  పరిధిలోని అంశాన్నేజగన్ ప్రస్తావించారంటూ..  వైసీపీ ఎత్తుకున్న కొత్త భాష్యం ఇప్పుడు నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.  

అమరావతిని పక్కన పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ  మావిగన్ అనే కొత్త రాజధాని ప్రతిపాదనను  వైసీపీ అధినేత తరపైకి తెచ్చి వచ్చే ఎన్నికలకు అదే తన నినాదమని ప్రకటించారు. మావిగన్ సు సమర్ధించేవారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేస్తారనీ, జనం ఎవరివైపు ఉన్నారన్నది అప్పుడు తేలిపోతుందని సవాల్ కూడా విసిరారు.  

అయితే.. మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. తాజాగా జగన్ సమీప బంధువు, సీనియర్ వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మావిగన్ ప్రాంతమంతా సీఆర్డీయే పరిధిలోనే ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో జగన్ పై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. 

ఇక రాజధాని అమరాతి విషయంలో  జగన్ తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014-19 మధ్య కాలంలో విపక్షంలో ఉన్న జగన్.. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. 2024 ఎన్నికలలో మూడు రాజధానులను ఏపీ ప్రజలు ప్రాంతాలకు అతీతంగా నిర్ద్వంద్వంగా తిరస్కరించి.. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతో ఘోర పరాజయాన్ని అందించారు.  ఓటమి తరువాత ఇప్పుడు అమరావతి పనులు వాయువేగంతో జరుగుతూ నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతాయని అంతా భావిస్తున్న తరుణంలో.. జగన్ మళ్లీ అమరావతిపై విషం చిమ్ముతూ... మావిగన్ రాగం అందుకున్నారు.

దానికి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని గ్రహించగానే.. సీఆర్డీయే కు జై అంటూ మావిగన్ కు కొత్త భాష్యం చెప్పడానికి తరాయరయ్యారు. తాను చెప్పిన మావిగన్ ప్రాంతం అంతా సీఆర్డీయే పరిధిలోనే ఉందంటూ వైసీపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ.. నష్ట నివారణ యత్నాలు చేస్తున్నారు. నిజంగానే జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంత మంతా సిఆర్‌డిఏ పరిధిలోనే ఉంటే.. అది అమరావతే కదా.. కొత్త పేరుతో జనంలో గందరగోళం సృష్టించడమెందుకన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్త పేరుతో రాజధాని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి ప్రజల్లో గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.

జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో..మూడు రాజధానుల జపం తప్ప ఆ దిశగా ఒక్క ఇటుక కూడా పేర్చలేదనీ, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతి  పనులను వేగవంతం చేస్తుండటంతో  వైసీపీ డిఫెన్స్‌లో పడిందనీ, దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడి సీఆర్డీయేకు జై అంటూ కొత్త రాగం ఎత్తుకుని మరో సారి జనంలో గందరగోళం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.  

AP Capital Issue, Jagan MAVIGUN, Amaravati vs MAVIGUN,, ళP Politics,  Capital Controversy, Jagan Change Voice Again, Telugu One

By
en-us Political News

  
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.