నాయకుడిగా కేటీఆర్ వైఫల్యం ఫిక్సైపోయినట్లేనా?.. సీఎం కల చెదిరిపోయినట్లేనా?

Publish Date:Feb 18, 2025

Advertisement

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బుధవారం (ఫిబ్రవరి 19) ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షడి హోదాలో కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 2023 ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత కేసీఆర్ దాదాపు రాజకీయ అజ్ణాత వాసం చేశారు.

పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. మధ్యలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేసినా అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు. మొత్తం మీద ఒక దశలో ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అడపాదడపా తనను కలవడానికి వచ్చిన పార్టీ నేతలతో ఫామ్ హౌస్ లో రాజకీయాలపై, పార్టీ విషయాలపై మాట్లాడినా అదంతా ఆఫ్ ది రికార్డ్ అన్నట్లుగానే ఉండేది. అయితే ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ అజ్ణాత వాసం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.

అది పార్టీ నేతల్లో, క్యాడర్ లో నూతనోత్సాహాన్నినింపవచ్చు కానీ అదే సమయంలో మరో విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తోంది. అదేమిటంటే పార్టీని ముందుండి నడిపించడంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వైఫల్యం. ఔను కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కేసీఆర్ ఎప్పుడో అవసరమైన రూట్ క్లియర్ చేశారు. బీఆర్ఎస్ రెండో సారి విజయం సాధించగానే కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి.. తన తరువాత సీఎం కేటీఆరేనన్న సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేటీఆర్ ప్రభుత్వంలో డిఫాక్టో సీఎంగానే వ్యవహరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా ఆయనే ప్రకటించే వారు. ఒక దశలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి దూకేస్తున్నారనీ, అంతకు ముందే కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టేస్తారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ  కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా పడుతూ వచ్చింది.  

వాస్తవానికి 2018లో ముఖ్యమంత్రి కేసీఅర్ ముందస్తు ఆసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినప్పటి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుకు వెళ్ళారని అప్పట్లోనే  గట్టిగా వినిపించింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల ముందు అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం ఖాయమని  అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్’ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. అదే సమయంలో కేటీఆర్’ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే, అప్పట్లో కారు సారు   పదహారు నినాదం బూమరాంగ్ అయ్యింది. దీంతో కేసీఆర్ ఢిల్లీ కలే కాదు.. కేటీఆర్ సీఎం కల కూడా ... కరిగిపోయింది.  

సరే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ రాజకీయ అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ దూకుడును కేటీఆర్ నిలువరించడంలో విఫలమయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ అజ్ణాతం వీడి బయటకు రావడానికి రెడీ అయ్యారు. అంతకంటే ముందు.. కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనీ, కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపడతారని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా కేటీఆర్ తన వైఫల్యాన్ని స్వయంగా అంగీకరించడమే కాకుండా సీఎం రేసులో లేననీ, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే ఉన్నారని స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇహ ఇప్పట్లో కేటీఆర్  సీఎం అనే మాట వినిపించే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.