అయినా జగన్ మారలేదు.. 2.0 ఉత్తుత్తి మాటలే!?

Publish Date:Feb 17, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తన తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. తరువాత విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అవుతారు. 
వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీని జగన్ జైల్లో పరామర్శించడానికి వెళ్లడం పట్ల వైసీపీలోనే ఒకింత అభ్యంతరం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా  చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష నేతపైనా ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని గత ఏడాది  జరిగిన ఎన్నికలలో జనం తిరస్కరించారు. అంతే కాదు.. వంశీ వంటి నేతలను ప్రోత్సహించిన జగన్ పార్టీకి కూడా గత ఎన్నికలలో జనం దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ఘోరంగా ఒడించారు. ఇప్పుడు తాను మారాననీ, ఇక నుంచి పార్టీకీ, పార్టీ క్యాడర్ కు అండగా  నిలుస్తాననీ, జగన్ 2.0ను చూస్తారనీ ఊదరగొడుతున్న జగన్ ఇప్పుడు అట్రాసిటీ కేసులో అరెస్టైన వంశీని  పరామర్శించడానికి  వెళ్లడం చూస్తుంటే ఆయన వైసీపీ కార్యకర్తలకు  కాదు.. పార్టీని జగన్ అండ చూసుకుని భ్రష్టుపట్టించిన వారికే వత్తాసుగా ఉంటారని అర్ధమౌతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

2019 ఎన్నికలకు ముందు ఒక్క‌ చాన్స్ ఇవ్వండి అంటూ జనాలను కోరుకుని.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. వారిలో ప్ర‌ధానంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా ఉన్నారు. వీరు మీడియా స‌మావేశం పెట్టారంటే ఏపీలోని చాలా ఇళ్ల‌లో టీవీలు బంద్ అయ్యేవి. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కుతోడు వైసీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేక‌పోయిన‌ ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన నేత‌ల‌పై, ఐదేళ్లు హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కొర‌డా ఝుళిపిస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే  జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్‌, పేర్ని నానిల‌పై కేసులు నమోద‌ య్యాయి. జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే, వంశీని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  జైలుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జైలుకెళ్లి వంశీని ఎలా స‌మ‌ర్ధిస్తారన్న అంశం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వంశీ త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు నిరూపిస్తున్నారు. గ‌న్న‌వ‌రం తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో వంశీతోపాటు ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేసి జైలుకు పంపించ‌గా.. వారిలో కొంద‌రు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా.. వంశీకి కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం వంశీ విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలులో ఉన్నాడు. అయితే వంశీ అరెస్టైంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ కేసులో ఫిర్యాదు దారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న అనుచ‌రులు కిడ్నాప్ చేశారు. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను బెదిరించ‌డంతోపాటు కొట్టారు. దీంతో ఇటీవ‌ల కోర్టులో త‌న‌కు, టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స‌త్య‌వ‌ర్ధ‌న్ చెప్పాడు. అయితే, కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా.. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను వంశీ, ఆయ‌న అనుచ‌రులు కిడ్నాప్ చేసి.. బెదిరింపుల‌కు గురిచేసిన‌ట్లు తేలింది. దీంతో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేసి అరెస్టు చేశారు. వంశీతోపాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వంశీ జైల్లో ఉన్నాడు. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకే  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  విజ‌య‌వాడ  జిల్లా జైలుకు వెడుతున్నారు. జ‌గ‌న్ వంశీని ప‌రామ‌ర్శించేందుకు జైలుకెళ్తే వైసీపీ ప‌రిస్థితి ప్ర‌జ‌ల్లో మ‌రింత దిగ‌జారిపోతుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  దళితుల పక్షపాతిగా చెప్పుకునే జగన్.. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వల్లభనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించడం సరికాదని ఆ  పార్టీ  నేతలే చెబుతున్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్ పైనా, వారి కుటుంబాల‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తోనే అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని,  ఇప్పుడు వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం స‌రియైన నిర్ణ‌యం కాద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.    

అన్నిటికీ మించి జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అంటూ   జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఆలోచించాన‌ని.. ఇక‌నుంచి జ‌గ‌న్ 2.0గా కార్య‌క‌ర్త‌ల బాగోగులను ప‌ట్టించుకుంటాన‌ని, వారికి అండ‌గా ఉంటాన‌ని జ‌గ‌న్ హామీలు ఇస్తున్నారు. దీంతో జ‌గ‌న్ లో మార్పు వ‌చ్చింద‌ని వైసీపీ క్యాడర్ భావించింది. అయితే, వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ జైలుకు వెళ్లడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  ఇక జ‌గ‌న్ మార‌రు.. వైసీపీతో ఉండి ఇబ్బందులు ప‌డ‌టం కంటే పార్టీ వీడడమే మేలని మెజారిటీ వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ తాను చెబుతున్న జగన్ 2.0 మాటలన్నీ ఉత్తుత్తివేననీ, ఆయనకు కావలసింది నేర పూరిత స్వభావం ఉన్న, ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించేందుకు వెనుకాడని వల్లభనేని వంశీ వంటి వారే తప్ప జనం, క్యాడర్, పార్టీ కాదని తేటతెల్లమైందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.