Publish Date:Nov 30, 2024
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తండ్రి కేసీఆర్ బాటనే అనుసరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటంచేశారు. ఎక్కడా బయటకు రావడంలేదు. ప్రసంగాలు చేయడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు.
కేసీఆర్ ఆబ్సెన్స్ లో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఏడాది కాలంలోనూ బీఆర్ఎస్ ను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పథంలో నడపడంలో కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారంటూ ఇంటా బయటా వస్తున్న విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా.. రాజకీయ సన్యాసమా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి పోలిటికల్ గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ కు బ్రేక్ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారనీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారనీ, అందుకే కుమార్తె కవితను రంగంలోకి దింపారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ వైఫల్యాల కారణంగా పార్టీ మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు చేతుల్లోకి వెళ్లిపోతుందన్న ఆందోళనతోనే కేసీఆర్ కవితను రంగంలోకి దింపారని అంటున్నారు. ఆ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయలకు ప్రకటించిన బ్రేక్ సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-announce-break-to-politics-39-189241.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.