ఆనాటి మాటలు నీటి మీద వ్రాతలేనా?

Publish Date:Jul 2, 2014

Advertisement

 

ఊహించినట్లే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై గొడవలు మొదలయ్యాయి. భౌగోళికంగా తెలంగాణా ఎగువనుంది కనుక నీటి విడుదల తన కనుసన్నలలో జరగాలని భావిస్తోంది. ఆ ధోరణి దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఆందోళన కలిగిస్తోంది. నీటి కోసం తెలంగాణా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి రావడమే కాక, ప్రతీసారి నీటి విడుదలకు కేంద్రంతో మోర పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

 

పదిరోజుల క్రితం నాగార్జున సాగర్ నుండి నీటి విడుదలకి తెలంగాణా ప్రభుత్వం నిరాకరించడంతో కేంద్ర జలసంఘమే స్వయంగా కలుగజేసుకొని, రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీళ్ళు విడుదల చేయామని ఆదేశించావలసి వచ్చింది. అప్పుడు మాత్రమే తెలంగాణా ప్రభుత్వం అయిష్టంగా నీటిని విడుదల చేసింది. కానీ ఆ నీరు నేటికీ దిగువనున్న కృష్ణా జిల్లాకు చేరకపోవడంతో, మరొక వారం రోజులపాటు ఇదే స్థాయిలో నీళ్ళు విడుదల చేయవలసిందిగా జలసంఘం తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొదటిసారే నీటి విడుదలకు తీవ్ర అభ్యంతరం చెప్పిన తెలంగాణా ప్రభుత్వం, మళ్ళీ మరో మారు నీటిని విడుదల చేయమన్నపుడు సహజంగానే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీష్ రావు దీనిపై జలసంఘానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జల బోర్డులో నిర్ణయం తీసుకోకుండా నీటిని విడుదల చేయరాదని, బోర్డు సమావేశం నిర్వహించాలని ఆయన కోరుతున్నారు.

 

తెలంగాణా మంత్రిగా ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, తెలంగాణకు ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇదే నీతిని పాటించినట్లయితే అప్పుడు తెలంగాణా పరిస్థితి ఏమిటి? అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే మహారాష్ట్రలో బాబ్లీ డ్యాం, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాంలు నిర్మింపబడి ఉన్నాయి. ఆ రెండు ప్రభుత్వాలు కూడా క్రిందకు నీటిని విడుదల చేయకుండా మొత్తం నీళ్ళు తామే వాడుకోవాలని భావిస్తే తెలంగాణా పరిస్థితి ఏమిటి?

 

రాష్ట్ర విభజన జరిగితే నీటి తగవులు వస్తాయని పదేపదే ఆంద్ర ప్రాంత నేతలు వాదించినప్పుడు, శత్రు దేశాలయినా చైనా, పాకిస్తాన్ దేశాలతోనే మనం నదీ జలాలను పంచుకోగాలేనిదీ, రాష్ట్రం రెండుగా విడిపోతే నీటిని పంచుకోలేమా? అని కేసీఆర్, హరీష్ రావు తదితరులు ఎదురు ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు నీటి విడుదలకు అభ్యంతరం చెపుతున్నారు. మరి ఆనాడు వారు నీటి పంపకాలపై చెప్పిన మాటలన్నీ అబద్దాలే అనుకోవాలా?

 

తెరాస నేతలకు ఆంద్ర ప్రజలపై, ప్రభుత్వంపై విద్వేషం ఉంటే ఉండొచ్చు గాక. కానీ ఇప్పుడు అధికారం చేప్పట్టిన తరువాత కూడా అదే విద్వేషాన్ని కొనసాగించడం హర్షణీయం కాదు. రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలే ఉన్నారు. కానీ భౌగోళికంగా విడిపోయారు. ఒకే జాతి ప్రజల మధ్యే సరయిన సఖ్యత, అవగాహన లేకపోతే ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాలు మనతో సఖ్యత ఎందుకు పాటిస్తాయి?

 

ప్రపంచంలో ఏ దేశమూ, దేశంలో ఏ రాష్ట్రమూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా మనుగడ సాధించలేదనే విషయం తెలంగాణా ప్రభుత్వం గుర్తుంచుకొని పరస్పర సహకార ధోరణి అలవరచుకొంటే అందరూ హర్షిస్తారు. అలా కాకుండా ఇదేవిధంగా నిత్యం ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కయ్యాలకు దిగినట్లయితే చివరికి తనే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది.

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.