వైసీపీచేయాల్సింది నిరసన దీక్షలు కాదు ప్రాయశ్చిత్త దీక్షలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.!

Publish Date:Aug 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ చేపట్టిన  నిరసన కార్యక్రమాలపై నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఐదేళ్ల హయాంలో చేసిన అక్రమాలు, అవకతవకలకు, ఆర్థిక అరాచకత్వానికీ ఆ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలన్నారు.   అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన  గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని  వ్యవస్థలను భ్రష్టు పట్టించినందుకు  ప్రాయశ్చిత్త దీక్షలు  చేసుకోవాలన్నారు. చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సర్వనాశనం చేసిందని కోటంరెడ్డి విమర్శించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్  నేతృత్వంలో  రాష్ట్ర అభివృద్ధిని తిరిగి గాడిలో పెడుతోందన్న కోటంరెడ్డి..  అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం, పరిశ్రమల రాకతో లక్షలాది ఉద్యోగాల సృష్టి జరుగుతోందని వివరించారు.

ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఒక్క సంతకంతో వేలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, వైకాపా నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేకాటలో గెలిచిన వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. పేకాట ఆడిన ఒక్కరికైనా టీచర్ ఉద్యోగం ఇచ్చినట్లు రుజువు చేస్తే, గంటలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.

 గతంలో తనపై బెదిరింపులకు దిగిన బోరుగడ్డ అనిల్ కుమార్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తనను ఫోన్లో తీవ్రంగా బెదిరించిన వ్యక్తి, ఆ తర్వాత దేవుడి స్క్రిప్ట్, ప్రకృతి దెబ్బతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. వైకాపా నాయకులు కార్యకర్తలను, నేతలను కేవలం వాడుకుని వదిలేస్తారనే దానికి బోరుగడ్డ అనిలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. మాట్లాడేటప్పుడు నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని హితవు పలికారు.

రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తోందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరణ వంటి అనేక ప్రజానుకూల చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే  వైసీపీ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నదని  ధ్వజమెత్తారు.

ప్రజలు వైపీపీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే యత్నాలు ఎప్పటికీ సాగవని హెచ్చరించారు. ప్రతిపక్షం ఇప్పటికైనా తన తీరు మార్చుకుని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రాయశ్చిత్త దీక్షలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Kotamreddy Sridhar Reddy, YSRCP atonement protests, Nara Lokesh's Mega DSC, Borugadda Anil Kumar, AP Alliance government

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.