కొండా సురేఖ సంయమనం కోల్పోయారా? సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ వెనుక కేటీఆర్ ఉన్నారన్న అనుమానంతో ఆమె విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల రచ్చ హోరెత్తి పోతోంది. అసలే హైడ్రా కూల్చివేతలతో ఇంటా బయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రేవంత్ సర్కార్ కు ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యలు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ సర్కార్, పార్టీ ప్రతిష్ఠ మంటగలిసే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి రేవంత్ కు ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు. నష్ట నవారణకు చేసిన ప్రయత్నాలు ఫలించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. తాజాగా కేసీఆర్ ను కేటీఆరే ఎదో చేసి ఉంటారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల పేరుతో ఆమె సినీ హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలు చోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మలు సైతం దగ్ధం చేశారు. మొత్తం తెలుగు సినీ పరిశ్రమ కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టింది. సోషల్ మీడియాలో సురేఖ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే కొండా సురేష్ సమంతకు, నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కూడా నష్ట నవారణ చర్యలకు ఉపక్రమించింది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాఫణ చెప్పినందున ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోరారు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తాను మాట్లాడిన మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పిన కొండా సురేఖ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేదేలే అంటున్నారు.
గత కొన్ని రోజులుగా కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తనపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ కు సమర్ధిస్తున్నారంటూ సురేఖ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారిని వేధించారనీ కూడా విమర్శలు చేశారు. ఓ వైపు ఆ రచ్చ అలా కొనసాగుతుండగానే.. కొండా సురేఖ మరో సారి నోరు జారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితం నుంచి దూరంగా ఉండడానికి కూడా కేటీఆరే కారణమని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఆయనను ఏదో చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ అధికార కాంక్షతో కేసీఆర్ ను ప్రజాజీవితంలోకి రాకుండా అండర్ గ్రౌండ్ లో బంధించి ఉంటారని కొండా సురేఖ అన్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదన్న ఆమె ఆయన కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ కేసీఆర్ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద కొండా సురేఖ తీరు కాంగ్రెస్ సర్కార్ కు రోజుకో తలనొప్పి తీసుకువస్తున్నది. కాంగ్రెస్ లోనే ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో ఆమె మంత్రి పదవికి ఎసరు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలలోనే ఓ చర్చ జోరుగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konda-surekha-slip-toung-again-25-186169.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.