Publish Date:Oct 22, 2025
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని.. తన సొంత పేరుతో కంటే.. బూతుల నానిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కామెంట్లు, ప్రత్యర్థులపై సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు.
ఆ తరువాత గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆయన కనిపించి, వినిపించి చాలా చాలా కాలమైంది. గత కొన్ని నెలలుగా కొడాలి నాని ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే తాజాగా ఆయన వైసీపీ నేతలతో పాటు కనిపించారు. దీంతో ఆయన తన రాజకీయ అజ్ణాతానికి తెరదించేశారా అన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
ఇంతకీ కొడాలి నాని కనిపించిన సందర్భం ఏంటయ్యా అంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన లండన్ పర్యటనను ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు పేర్నినాని సహా పలువురు ఆయన స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో కొడాలి నాని ఏ సందర్భంలోనూ బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలకు కూడా ముఖం చాటేశారు. అటువంటి కొడాలి నాని తాజాగా జగన్ కు స్వాగతం పలకడానికి వైసీపీ నేతలతో కలిసి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల భయంతో కలుగులో దాగినట్లుగా ఇంత కాలం వ్యవహరించిన నాని ఇప్పుడు ఏ ధైర్యంతో బయటకు వచ్చారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో ప్రారంభమైంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్థి పథకాల ప్రారంభం, అమలు కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి జగన్ తన వంతు ప్రయత్నంగా గతంలో పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా చెలామణి అయ్యి.. ఇప్పుడు కేసుల భయంతో ముఖం చాటేస్తున్న వారిని ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కొడాలి నాని తన రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చినట్లేనా? ఇక ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తు వేగం పుంచుకుంటుందా? అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-with-ycp-leaders-in-gannavaram-39-208282.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.