Publish Date:Oct 21, 2025
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ అజ్ణాతాన్ని వీడి క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి ప్రవేశిస్తున్నారా? బీఆర్ఎస్ కు చావో రేవోగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రచార సారథ్యం వహించనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంలో జూబ్లీ బై పోల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బైపోల్ కు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సతీమణి సునీతను రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది.
ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మిగిలిన పార్టీల కంటే ఈ ఉప ఎన్నిక విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఈ ఉప ఎన్నికలో విజయంపైనే ఆ పార్టీ ఉనికి, ఊపు ఆధారపడి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికలో పార్టీని గలిపించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా తానే ప్రచార సారథ్యం వహించాలన్న తలపుతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినా ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ పార్టీ ప్రధాన ప్రచార కర్తగా, ప్రచార సారథిగా ఉంటారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఆ మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా కేసీఆర్ పేరును కూడా బీఆర్ఎస్ చేర్చంది. ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్ లు తమ ప్రచారం ప్రారంభించేశారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ కూడా జూబ్లీ బైపోల్ ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-to-lead-brs-campaign-in-jublee-bypoll-39-208279.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.