Publish Date:Jul 22, 2022
మమ్ముమ్ముద్దంటే చేదా.. అంటూ పాత సినిమాలో నాగేశ్వర్రావు ఓ పిల్లని అడిగిన ప్రశ్నతో అప్పటి మహి ళా లోకం అమాంతం ఆగ్రహించింది. తమ నవలా కథా నాయకుడు ఇలాంటి వేషాలేయడ మేమి టని. ఆ తర్వాత చిరు ఏకంగా ముద్దులే పెట్టేయడం కుర్రాళ్లని వీలైనంత రెచ్చగొట్టడం సాధారణమైంది. వెరసి ముద్దు అనేది అదేమంత ప్రమాదకరం, అసహ్యించుకుని తలతిప్పేసుకునే విషయం కాదని ఇప్పటి యువత ప్రకటన. అందుకు తాజా ఉదాహరణ కర్ణాటక మంగళూరులో ఒక కళాశాల విద్యార్ధుల వీడియో హడావుడి.
కాస్తంత మర్యాదస్తుల్లానే ఉన్నారని ఒక అపార్ట్మెంట్ వారు కాలేజీ పిల్లల్ని అనుమతించారు. కానీ వారి సరదాలు, ఆటల మధ్యలో ఏకంగా లిప్లాకింగ్ పోటీలు పెట్టుకోవడం సీరియస్ విషయమైంది. కుర్రాళ్లకి, అమ్మాయిలకి బహు సరదా సమాచారమే కావచ్చు. కానీ దాని పర్యవసానం ఆలోచించారా? తెలుసునా అన్నదే అనుమానం. ఎందుకంటే ఆ పిల్లల తల్లిదండ్రులు దీన్ని గురించి పోలీసులకీ ఫిర్యాదు చేయ లేదట!
కాలేజీ పిల్లలు గాఢపరిష్వంగంలో ముద్దు మాయలో పడిపోయారు. చుట్టూ కొందరు చేరి కేకలు వేస్తూ, ఈలలు వేస్తూ గోల చేస్తున్నారు. వారిలో ఒకడు ఇంతకంటే గొప్ప చిత్రం ఉండదనుకున్నాడు. అంతే ఆ సీన్ని వీడియో తీసి జనాల్లోకి వదిలేడు. అది వైరల్ అయి ఆ ముద్దుల జంట లోకప్రసిద్ధమైంది. అది ముద్దుల పోటీ అని పోలీసులు తెలపడమే చిత్రం. అయినా యువత ఈ విధంగా వికృతంగా ఆనందం చేసుకోవడం నేరం కాకుండా పోతుందా? ఈ వీడియో తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీ సులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని, ఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ తెలిపారు. వారంరోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం వారిని హెచ్చ రించి కాలేజీ నుంచి తొలగించింది.
అయితే, ఈ ముద్దుల కాంపిటిషన్పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kiss-competition-25-140292.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.