ఇంతకీ సమైక్య చాంపియన్ ఎవరో

Publish Date:Oct 15, 2013

Advertisement

 

ఇప్పుడు రాష్ట్రంలో సమైక్యవాదంపై పేటెంట్ హక్కుల కోసం గట్టి పోరాటం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరియు లగడపాటి రాజగోపాల్ ఈపోటీలో ముందున్నారు. అయితే, ఈ పోటీ ప్రధానంగా మొదటి ఇద్దరి మధ్యే ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే.

 

ఈ ఇద్దరిలో ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన అధిష్టానాన్నిదిక్కరిస్తూ సమైక్యగీతం ఆలపిస్తున్నకారణంగా సహజంగానే జనాలలో కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించుకొని ఈ రేసులో ముందున్నారు. మరి ఆయన నిజాయితీగానే ఈ సమైక్యగీతం ఆలపిస్తున్నారా లేక అధిష్టానం స్వరపరచిన ట్యూన్స్ పట్టుకొని పాడుతున్నారా లేక రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తన కుర్చీకి డోకా లేకుండా చూసుకోనేందుకే ఈపాట అందుకొన్నారా లేక తన నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్నజగన్మోహన్ రెడ్డిని డ్డీ కొని నిలబడేందుకే ఈ పాట పాడుతున్నారా అనే ధర్మ సందేహాలు పక్కన బెడితే, ఆయన రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టం అవుతున్నపటికీ ఆయనే సమైక్యరాగం గట్టిగా ఆలపిస్తూ దానిపై పూర్తి పేటెంట్ హక్కులు తనవేనంటున్నారు. అయితే ఆయన పార్టీలో ఉన్నాబయటకు వెళ్లి వేరే కొత్త కుంపటి పెట్టుకొన్నాకూడా అంతిమంగా ఆయన, కాంగ్రెస్ పార్టీయే లభాపడతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మంచి దూకుడుగానే పావులు కదుపుతున్నారు. జైలు నుండి బయటకు వచ్చీ రాగానే, తన పార్టీ ఆలపిస్తున్నసమైక్యరాగంలో మరికొన్నికొత్తరాగాలు జోడించి గొంతెత్తి పాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పాటకి కిరణ్ కుమార్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతూ శృతి తప్పిస్తున్నారు.

 

ఉద్యోగులతో కలిసి కోరస్ పాడి జనాల చేత చప్పట్లు కొట్టించుకోవాలని జగన్ ప్రయత్నిస్తే, పైలీన్ తుఫాను పేరు చెప్పి వారిని సమ్మె విరమింపజేయడంతో ఆయన ఒక్కడే ఒంటరిగా విషాద గీతం పాడుకోక తప్పలేదు. పోనీ ఆమరణ దీక్ష చేసుకొంటూ ఆయన పాడిన సమైక్య రాగాన్ని, అదొక కూనిరాగమన్నట్లు దానికి నామమాత్రంగా కూడా స్పందించకుండా నూటొక్క దీక్షల్లో ఇదీ ఒకటి అన్నట్లు తీసిపారేయడంతో వ్రతం(దీక్ష) చెడినా ఫలం దక్కకుండా పోయింది.

 

పోనీ హైదరాబాదులో ఓ ఐదు లక్షల మందిని పోగేసి వారి ముందు సమైక్యరాగం తీద్దామనుకొంటే, శాంతి భద్రతలంటూ కాలు అడ్డం పెడుతున్నాడని కోర్టుకు మోర పెట్టుకొనే పరిస్థితి కల్పించారు. పోనీ “ఇదే పాట ఇదే నోట వేరే ఊళ్ళో పదే పదే పాడుకొంటాను. కనీసం అందుకయినా నా బెయిలు షరతులు సడలించండి మహాప్రభో” అని కోర్టుకు విన్నవించుకొన్నారు.

 

ఒకవేళ కోర్టు ఆయన సీమాంద్రాలో కచేరీ చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోతే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన జీవితాన్నే మార్చేసే ఒక సరి కొత్త ఐడియా వెంటనే అమలుచేయక తప్పదు. లేకపోతే ఇంతకాలం ఎంతో రిస్కు తీసుకొని పాడిన సమైక్యరాగం కాస్తా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే మిగిలిపోతుంది. పైగా అది కాంగ్రెస్ స్వరపరిచిన గీతం కాకపోయి ఉంటే, పార్టీలోను ఆయనకు తాళం తప్పవచ్చును.

 

ఈ రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పాడుతున్నది ఒకటే పాట అయినప్పటికీ వేర్వేరు రాగాలు, తాళాలు వేస్తూ ఆలపిస్తూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి జనాలు రాబోయే ఎన్నికలలో వీరి పాటకు తాళం వేస్తారో లేక ఇద్దరూ సమైక్యరాగం తీస్తూ రాష్ట్ర విభజన చేసి పెట్టినందుకు ఇద్దరికీ గోడ్రేజ్ తాళం వేసేసి, అందరి కంటే సీనియర్ సమైక్య రాగాలాపకుడయిన ఏ లగడపాటినో లేక వేరెవరినో మేళ తాళాలతో స్వాగతం పలుకుతారో చూడాలి.

By
en-us Political News

  
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.