రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ డబుల్ గేమ్

Publish Date:Oct 16, 2013

Advertisement

 

‘రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరుగదు’ అనే వాదన దగ్గర నుండి ‘ఎన్నికల వరకు జరుగదనే’ వాదనకి దిగిరావడంతోనే రాష్ట్ర విభజన అనివార్యమని తేటతెల్లమవుతోంది. అంటే సీమంద్రా నేతలు రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడటమే కాకుండా ప్రజలను కూడా అందుకు సిద్దపరుస్తున్నారని అర్ధమవుతోంది. అయితే ఎన్నికల వరకయినా ఈ ప్రక్రియ వాయిదాపడాలని వారు కోరుకోవడం చూస్తే, రాష్ట్ర విభజన కంటే తమ రాజకీయ భవిష్యత్ పట్ల వారు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.

 

కనీసం ఎన్నికల వరకు విభజన జరుగకుండా ఆపగలిగితే, ఎలాగో కష్టపడి మళ్ళీ ఎన్నికలలో గెలవచ్చుననే దురాలోచనే వారిలో కనబడుతోంది. అయితే వారు మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీని తిడుతున్నారు. పార్టీలు మారుతున్నారు. కొత్త పార్టీ పెడతామంటున్నారు. అయితే ఎన్నికల వరకు విభజనను ఆపినంత మాత్రాన్న సీమాంధ్ర ప్రజలు ఓట్లు వేస్తారని అనుకోలేము.

 

కానీ వారు మాత్రం అధిష్టానాన్ని ఒప్పించి ఎన్నికల వరకు విభజన ప్రక్రియను నెమ్మదించగలిగితే ఈలోగా ప్రజలకు ఏదో మాయమాటలు చెప్పయినా మళ్ళీ తమకే ఓట్లు వేయించుకోగాలమనే ధీమా సీమాంద్ర కాంగ్రెస్ నేతలలో బలంగా ఉంది. అందుకే వారు ‘తల్లీ నీకు మొక్కెద! దయతలచి విభజన ప్రక్రియకు కాస్త బ్రేకులేయవే’ అంటూ అధిష్టానాన్ని వేడుకొంటున్నారు.

 

ఒకప్పుడు అడుగు ముందుకు వేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామని బెదిరించే స్థాయి నుండి నేడు కాస్త బ్రేకులేస్తే చాలాని కాళ్ళ బేరానికి వచ్చిన సీమాంధ్ర నేతలని చూసి అధిష్టానం జాలిపడినట్లుంది. బహుశః అందుకేనేమో “రాష్ట్రవిభజన ఎన్నికల ముందే జరుగుతుందో లేక తరువాతే జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని” చాక్లెట్ వంటి తీయని మాట చాకో చేత పలికింపజేసింది.

 

అయితే మళ్ళీ అదే సమయంలో అటు తెలంగాణా ప్రజలకి తమ శీలం మీద అనుమానం కలుగకూడదనే ఆలోచనతో వెంటనే దిగ్విజయ్ సింగ్ “చాకో అన్నమాటలకి నేను జవాబు దారీ కాబోను. రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరిగి తీరుతుంది,” అని మరో కత్తి లాంటి ప్రకటన చేసేసి చేతులు దులుపుకొన్నారు.

 

ఎన్నికలలోగా రాష్ట్రాన్ని కత్తిరించేయాలా వద్దా అనే సంగతి మాత్రం రాష్ట్రంలో పరిస్థితులని బట్టి నిర్ణయించుకొని ముందుకు సాగవచ్చును. విభజిస్తే సీమంద్రా కాంగ్రెస్ నేతలు పోతారు. కానీ వారికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే చేసుకొంది గనుక వారి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ విభజించకపోయినట్లయితే, తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుపోతే, ఆనక తెరాస ఏకుమేకయి కూర్చొనే ప్రమాదం ఉంది. గనుక విభజనకే మొగ్గు చూపవచ్చును.

 

కానీ ఎన్నికలకి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది, గనుక ఇది సాంకేతికంగా సాధ్యపడుతుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న.

By
en-us Political News

  
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.