పంతం నెగ్గించుకున్న సిఎం కిరణ్? డిజిపిగా దినేష్రెడ్డి
Publish Date:Sep 30, 2012
Advertisement
డిజిపి నియామకంలో కులసమీకరణ పాటించిన సిఎంగా కిరణ్కుమార్రెడ్డి తన పేరు నిలబెట్టుకున్నారు. కేంద్రట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డిజిపిగా దినేష్రెడ్డికి మరోసారి పూర్తిబాధ్యతలను సిఎం అప్పగించనున్నారు. గతంలో దినేష్రెడ్డి నియామకం చెల్లదని సీనియర్ ఐపిఎస్ అధికారి గౌతంకుమార్ క్యాట్ ద్వారా వెల్లడించిన తీర్పును సిఎం ముందు నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు. రాజకీయ నాయకులే స్వయంగా తనను అడ్డుకుంటున్నారని గ్రహించే గౌతం కుమార్ తనపై భవిష్యత్తులో ఒత్తిడి వస్తుందని ఉద్యోగానికి విఆర్ఎస్కు ధరఖాస్తు చేసుకున్నారు. దీనిని వెంటనే ఆమోదించిన సిఎం ఆ తరువాత గౌతంకుమార్ తెరమరుగు అయ్యేంత వరకూ తన వంతు పాత్రను పోషిస్తూనే వచ్చారు. క్యాట్తో పాటు రాష్ట్రహైకోర్టు కూడా జోక్యం చేసుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిఎం కొంచెం వెనక్కి తగ్గినట్లు నటించారు. ఆ తరువాత పూర్తిస్థాయి అర్హతలున్న డిజిపిగా దినేష్రెడ్డి పేరు ఖాయమయ్యేందుకు తెర వెనుక నాటకాన్ని నడిపారు. సిఎం కోరుకున్నట్లుగానే పూర్తిస్థాయి బాధ్యతలతో డిజిపిగా దినేష్రెడ్డి కొనసాగేందుకు తాజా ఉత్తర్వులు వచ్చాయి. దీంతో పంతం నెగ్గించుకున్న సిఎంగా కిరణ్కుమార్రెడ్డి ఖ్యాతి గడించారు. రాష్ట్రప్రభుత్వం యుపిఎస్సీకి పంపించిన మూడుపేర్లలో దినేష్రెడ్డి పేరును ప్రకటించారు. ఇంకా రెండేళ్లు సర్వీసు ఉన్నందున దినేష్రెడ్డికి అవకాశం లభించిందని సమాచారం.
http://www.teluguone.com/news/content/kiran-kumar-reddy-24-17781.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





