Publish Date:Feb 26, 2026
కర్నాటక రాజకీయం రసకందాయంలో పడిందా? డీకే వర్గం తిరుగుబాటుకు రెడీ అయ్యిందా? రాష్ట్రంలో అధికార మార్పిడి అంశం తుది అంకానికి చేరిందా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో తిరుగుబావుటా ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్ఠానం ఇచ్చిన మాట మేరకు సిద్ధరామయ్య స్థానంలో తనను సీఎంను చేయాలని గత కొంత కాలంగా గట్టిగా పట్టుబడుతున్నారు.
ఈ విషయంలో అధిష్ఠానం చేస్తున్న తాత్సారం కారణంగా ఆయన వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా డీకే వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ హోటల్ లో గురువారం (ఫిబ్రవరి 27) సమావేశం కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, కర్నాటక కాంగ్రెస్ లో ప్రకంపనలకు కారణమైంది. ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక అని చెబుతున్నప్పటికీ.. అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానంపై తిరుగుబావుటా సంకేతమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల తర్వాత పదవిని డిప్యూటీ సీఎంకు అప్పగిస్తారనే ఒప్పందం ఉందని డీకే శివకుమార్ వర్గం బలంగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య తన బలాన్ని నిరూపించుకునేందుకు సమాయత్తమయ్యారన్న సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా అధిష్ఠానానికి బలంగా ఇచ్చారని అంటున్నారు. కాగా ఈ సమావేశానికి సిద్ధరామయ్య కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు కూడా హాజరు కావడంతో సిద్దరామయ్య, డీకే మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కు చేరిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
అదలా ఉంటే.. డీకే శివకుమార్ వర్గం బెంగళూరు హోటల్ లో సమావేశమైన సమయంలోనే కాకతాళీయమో, యాధృచ్ఛికమో చెప్పలేం కానీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు పలుకుతున్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వీరంతా ఆదివారం (మార్చి1)న స్వదేశానికి తిరిగి రానున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆధిపత్యపోరుపై ఎప్పట్లగానే స్పందించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం అధిష్ఠానానిదేనన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/key-developement-in-karnataka-politics-39-214720.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.