కేతన్ అగర్వాల్ మర్డర్ మిస్టరీ వెనుక విస్తుపోయే నిజాలు!

Publish Date:Jun 26, 2026

Advertisement

 

మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే పారిశ్రామికవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన దర్యాప్తులో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది. పింప్రి చించ్వాడ్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడైన కేతన్‌ను, అతడి కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కుట్రపూరితంగా 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపేసిందని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. 

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి, ఇటీవలె తిరిగివచ్చిన కేతన్ అగర్వాల్‌కు సియా గోయల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 25న వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ ప్యాలెస్‌ను ఏకంగా రూ. 17 కోట్ల భారీ వ్యయంతో పెళ్లి కోసం బుక్ చేశారు. అంతేకాదు, వీఐపీ అతిథుల ప్రయాణం కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. అయితే, ఇంతలోనే ఈ దారుణం జరగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  

పోలీసుల ప్రాథమిక విచారణలో సియా గోయల్ చెప్పిన సమాధానాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. కేతన్ పెట్టుకునే విగ్, అతని నత్తిగా మాట్లాడే అలవాటు (stammering) తనకు అస్సలు నచ్చలేదని సియా విచారణలో పేర్కొంది. అయితే నేరుగా పెళ్లి వద్దని చెబితే కుటుంబాల మధ్య ఉన్న కోట్ల రూపాయల బిజినెస్ డీల్స్ దెబ్బతింటాయని, అలాగే సమాజంలో తల్లిదండ్రుల పరువు పోతుందని ఆమె భయపడింది. తన కుటుంబానికి మానసిక వేదన మిగల్చడం కంటే, కేతన్‌ను పూర్తిగా లైఫ్ నుంచి తొలగించడమే సులువైన మార్గమని భావించినట్లు సియా పోలీసులకు తెలిపింది. 

ఈ క్రమంలోనే ఆమె జూన్ 19న తన పుట్టినరోజు వేడుకల నెపంతో, దానికి ఒకరోజు ముందు అంటే జూన్ 18న కేతన్‌ను బలవంతంగా లోహగడ్ కోట ట్రెకింగ్‌కు పిలిపించింది. నిజానికి జూన్ 14న కూడా ఆమె కేతన్‌ను అక్కడికి తీసుకెళ్లి లోయలోకి తోసేయాలని ప్రయత్నించగా, ఒక చెట్టు అడ్డుపడటంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పామును చూసి భయపడి నెట్టేసానంటూ సియా కట్టుకథ అల్లింది. ఎలాగైనా కేతన్‌ను వదిలించుకోవాలని డిసైడ్ అయిన సియా, జూన్ 18న మరోసారి అతడిని అక్కడికి తీసుకెళ్లి, ఫోటోలు దిగుతున్న సమయంలో తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసింది.  

కేతన్ అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ కావడంతో అతడు అంత తేలిగ్గా జారిపడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు లోనావాలా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పక్కాగా స్కెచ్ వేశారు. చేతన్ చౌదరి తన లొకేషన్ ట్రేస్ కాకుండా ఉండేందుకు కొంధ్వాలోని తన నివాసంలోనే మొబైల్ ఫోన్‌ను వదిలి వెళ్లాడు. 

అయినప్పటికీ దర్యాప్తులో వారి మధ్య దాదాపు 2,000 కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జూన్ 18న లోనావాలాలో 33 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, కోట కింద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఒక వ్యక్తి తలకు క్యాప్ ఉన్న హుడీ టీషర్ట్ వేసుకుని, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం పోలీసుల కంటపడింది. అంతటి ఎండలో అలాంటి దుస్తులు ధరించడం వెనుక గుర్తింపు దాచాలనే కుట్ర ఉందని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా, ఆ హుడీ ధరించిన వ్యక్తి చేతన్ చౌదరి అని తేలింది. సియా గోయల్ వేసిన ఈ వికృత మైండ్ గేమ్ మరియు అహంకారం చివరకు ఆమెను, ఆమె ప్రియుడిని కటకటాల వెనక్కి నెట్టింది.  

By
en-us Political News

  
వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి
విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం
తుంగభద్ర డ్యామ్ ఆధునీకరణ మరియు పునర్నిర్మాణ పనుల పూర్తి సందర్భంగా కర్ణాటకలో నిర్వహించిన సభ
దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరియు పొరుగున ఉన్న కర్ణాకటతో నదీ జలాల పంపకాల వ్యవహారం
అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన కడప బిడ్డ...
హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోంది, కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన
సంచలన కేసుగా మారిన పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్‌ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.