అవినీతిని అంతం చేస్తానంటూ.. అవినీతి ఆరోపణలతోనే పనతం.. కేజ్రీవాల్ ప్రస్థానం

Publish Date:Feb 9, 2025

Advertisement

ఢిల్లీలో ఊపిరి పోసుకున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)   జాతీయ పార్టీగా ఎదిగి పంజాబ్ లో అధికారం కైవసం చేసుకుని 12ఏళ్లు ఢిల్లీని పరిపాలించి అవమానకర పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, బీజేపీ లను వ్యతిరేకించిన పార్టీగా, అవినీతిని దనుమాడుతామంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆప్  ఆ తరువాత రాజకీయ పరమపద సోపానపటంలో అవినీతి అనే పెద్ద పాము చేతిని చిక్కి పతనమైంది. అవినీతిపై పోరాటం అన్న నినాదాన్ని పక్కన పెట్టి స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అలాగే రాజకీయ చదరంగం కూడా ఆడి ఆ ఆటలో బీజేపీ ఎత్తులకు చిత్తైపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో భాగస్వామి అయి కూడా తాజా ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి.. చేజేతులా ఇండియా కూటమి ఓట్లు చీలి తన ఓటమికి కారణమయ్యేలా చేసుకుంది.  

దశాబ్దానికి పైగా ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా   కనీసం సౌకర్యాల కల్పనలో విఫలమైంది. ఉచితాలనే నమ్ముకుని బొక్కబోర్లా పడింది.  ఆప్  2012లో పుట్టి,2013 ఢిల్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు కైవసం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తరువాత  .2020 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా  కూడా62 స్థానాలు సాధించి సత్తా చాటుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే మళ్లీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలైంది. 26 ఏళ్లుగా బీజేపీకి అందని ద్రాక్షలా నిలిచిన హస్తిన పీఠాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఆ పార్టీకి  ఈ సారి బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుని అధికార పగ్గాలు అందుకుంది. 

 ఈ పరాజయానికి ఆప్ స్వయంకృతాపరాథమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరాజయంతో ఆప్ తాను స్వయంగా ఓడిపోవడమే కాకుండా.. ఇండియా కూటమి ఐక్యతను కూడా ప్రశ్నార్దకం చేసింది.
మిత్రధర్నాన్ని పాటించడానికి అహంకారంతో అంగీకరించకపోవడం కారణంగా, అంటే కాంగ్రెస్ తో పొత్తుకు నిరాకరించడం కారణంగా ఆప్ కనీసం 14 స్థానాలలో స్వల్న తేడాతో ఓడిపోయింది. ఆప్ పార్టీకి పోలైన ఓట్ల శాతం చూస్తే ఇది స్పష్టంగా అర్ధమౌతుంది. కాంగ్రెస్ కు పోలైన 7 శాతం ఓట్లు ఆప్ ఓటమిని లిఖించాయి.  అన్నిటికీ మించి.ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్,ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు.  ఢిల్లీలో దెబ్బతిన్న రహదారులు,  ప్లై ఒవర్లపై గుంతలు,  తాగునీటి సమస్య .యమున జలాలను శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించడం, ఎన్నికలకు ముందు ఆ యమునా జలాలను కలుషితం చేస్తున్నది హర్యానాలోని బీజేపీ సర్కార్ అంటూ ఆరోపణలు చేసి అభాసుపాలు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త కూడా ఆప్ ను ప్రజలు ఊడ్చేయడానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇప్పటి వరకూ ఆప్ తన పరాజయాన్ని తానే ఎలా శాశించుకుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి   పకడ్బందీ వ్యూహాలతో, ప్రణాళికా బద్ధంగా  బీజేపీ ఎలా చెక్ పెట్టిందో చెప్పుకుందాం. అవినీతిపై అలుపెరుగని పోరాటం అంటూ మొదలైన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా గత పదేళ్లుగా అడుగులు వేశారు. పంజాబ్ లో అధికార పగ్గాలు ఆప్ చేతికి దక్కాయి. కానీ బీజేపీ ఆయన ఆశలకు, ఆకాంక్షలకు కళ్లెం వేసింది.  సొంత రాష్ట్రంలోనే ఆప్ ను ఓడించింది. ఇందు కోసం ఆప్ లో చీలిక తీసుకువచ్చింది. పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా వ్యవహరించిన కేజ్రీవాల్ పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఒకప్పుడు కేజ్రీవాల్ పార్టీలో కీలకంగా ఉన్న స్వాతి మలివాల్..ఆయనకు బద్ధ వ్యతిరేకిగా మారారు.  ఆప్ నాయకుడు, కేజ్రీవాల్ సన్నిహితుడు తనపై దాడికి పాల్పడినా కేజ్రీవాల్ పట్టించుకోకపోవడమే స్వాతి మలివాల్  పార్టీలో రెబల్ గా మారడానికి కారణం.  మౌలికసదుపాయాలు కల్పించడంలో విఫలమైన క్రేజీ వాల్ అనే నినాదాన్ని హైలైట్ చేసారు. క్రేజీవాల్ ఓటమిని సోషల్ మీడియాలో మహాభారతం లో "ద్రౌపతి వస్త్రాపహరణం"పోస్టర్ పెట్టి తన ఆక్రోశాన్ని తీర్చుకున్నారంటే పార్టీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు కేజ్రీవాల్ అహంకారాన్ని రావణాసురుడి గర్వంతో పోల్చారు. 
అధికార,ధన దాహం, అవినీతి ఆప్ నైజం అంటూ బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. కేజ్రీవాల్ గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథ, సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే కూడా ఆప్ పరాజయాన్ని స్వాగతించారు. ఇలా అన్ని వర్గాలలోనూ ఆప్ ప్రతిష్ట మసకబారింది. అందుకే మూడు సార్లు ముఖ్యమంత్రిగా  పని చేసిన క్రేజీవాల్  ప్రస్థానం ఒక సామాన్యుడు పర్వేజ్ శర్మ చేతిలో 1844 ఓట్ల తేడాతో ఒటమిపాలయ్యారు.   సొంత నియోజకవర్గంలో ఓటమితో ఆయన ఇక రాజకీయంగా పుంజుకోవడం కష్ట సాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏదిఏమైనా అవినీతి నిర్మూలన నినాదంతో వెలుగులోకి వచ్చి జాతీయ పార్టీగా అవతరించి,ఆ అవినీతీ లోనే  క్రేజీవాల్,ఆయన ప్రభుత్వం కొట్టుకుపోవడం రాజకీయ నాయకులకు,పార్టీలకు ఒక గుణపాఠంగా మిగులుతుందన్నడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.