కేసీఆర్ అంతన్నారు ఇంతన్నారు..చివరికి తుస్సుమని పించారు!

Publish Date:Apr 29, 2022

Advertisement

కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ప్లీనరీ వేదికగా చేసిన ప్రసంగంలో తుస్సు మనిపించారు. ఫ్రంట్ లేదు, కూటమి లేదు.. ప్రాంతీయ పార్టీల ఐక్యత ఊసూ లేదు. మరి ఇంత కాలం ఆయన చెప్పిన మాటలు, తిరిగిన తిరుగుళ్లు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీలు అంతా తుస్సేనా.. తెరాస క్యాడర్ ను కూడా ఇదే అనుమానం తొలుస్తున్నది.
 బీజేపీ మంత్రుల అవనీతి చిట్టా ఉందన్న ఆయన ప్లీనరీ వేదికపై ఆ మాటే ఎత్తలేదు. తిమ్మిని బమ్మిని చేసిన చందంగా జాతీయ స్థాయి అజెండా అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అది కూడా కేవలం బీజేపీపై విమర్శలు, ఆరోపణలు, తన పాలనపై పొగడ్తల పొగడ దండలు వినా ప్లీనరీలో ఆయన చేసిన ప్రసంగంలో పసా లేదు, విషయమూ లేదు. 

జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ సహా కేంద్రంలో తాను చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇచ్చిన బిల్డప్ అంతా కేసీఆర్ ప్లీనరీ ప్రసంగంతో తుస్సు మనిపోయింది. కారణం ఏమిటి? అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూడా రాజకీయ పరిస్థితులు అనువుగా లేవన్న గ్రహింపుతోనే కేసీఆర్  గత గంభీర ప్రకటనల ఊసెత్తకుండా, కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి, తన మాటల గారడీతో ప్రజలలో తన గత ప్రకటనల ప్రభావాన్ని తుడిపేయడానికి ప్రయత్నించారు. 

ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ ప్రసంగంలో బీజేపీవై విర్శలు, ఆరోపణలు కూడా ఏదో చేయకపోతే బాగుండదు, ఇంత కాలం ఆ పార్టీపై ఒంటికాలిపై లేచి ఇప్పుడు అసలు ఊసే ఎత్తకపోతే జనం సందేహిస్తారు అన్నట్లుగానే ఉన్నాయి.  

ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంలో మెరుపులు లేదు, సంచలన ప్రకటనలు లేవు, నిర్ణయాలు లేవు..కేవలం ఫ్రంటు, కూటమి, పార్టీ వంటివేమీ లేవన్న వివరణ ఇచ్చుకోవడానికే అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. అలాగే జనం దృష్టిని రాజకీయ అంశాలపై నుంచి తెరాస వైపు తిప్పుకునేందుకే ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్లీనరీ పెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవచ్చు. ఉద్యమ సమయంలో పార్టీ త్యాగాలను, పోరాట సంకల్పాన్ని మరోసారి వల్లె వేసి ప్రజల్లో ఉద్వేగాలను పదిలంగా కాపాడుకోవచ్చు. అంతే కానీ ప్లీనరీ నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ ప్లీనరీ ఏర్పాటు చేశారు. 

జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్  స్వయంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, డిల్లీ లకు ఇటీవల వెళ్ళారు. ఒక్క డిల్లీ సిఎం మినహా... మిగతా వారిని కలిశారు. దేశ రాజకీయ పరిస్థితులు, సమాఖ్య స్పూర్తి, రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవరసరం వంటి విషయాలపై చర్చించారు. తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.  బిజెపిని బంగాళాఖాతంలో కలిపేయ్యాలని సిఎం కెసిఆర్ నినదించారు. బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీయేతర కూటమిని ఏర్పాటుకు సంకేతాలిచ్చారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 2019లోనూ వెస్టుబెంగాల్ కు వెళ్ళిన సిఎం కెసిఆర్ తర్వాత ఇతర నాయకులను కలిశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రకటనలు కూడా చేశారు. అనంతరం ఈ విషయాలు ప్రక్కకు పెట్టారు. రెండేండ్లు గడిచాయి. ఇటీవల కూడా పలు రకాలుగా జాతీయ రాజకీయాలపై  ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ కార్యరూపంలోకి రాలేదు. దీంతో టిఆర్ఎస్ ప్లీనరీలో ఫ్రంట్ లేదు. కూటమి లేదు. గుంపు కూడా లేదు. దేశానికి ప్రత్యేకంగా ఓ ఎజెండా కావాలి. ప్రత్యేక రైతు, పారిశ్రామిక విధానం రావాలి. అంటూ తేల్చాశారు. దేశ్ కీ నేతా స్థాయిలో ప్రచారం చేసుకున్న కేసీఆర్ హఠాత్తుగా ఆస్త్ర సన్యాసం చేయడమేమిటి? అన్న చర్చ ప్లీనరీ ప్రసంగం తరువాత తెరాస శ్రేణుల్లో మొదలైంది.

 దేశ్ కీ నేత కెసిఆర్ అనే ప్లెక్సీలు ఇతర రాష్ట్రాల్లోనూ వెలిశాయి. కానీ, దేశంలో కూటమి లేదు. ఫ్రంటులేదు. గుంపు లేదు. అని సిఎం కెసిఆర్ తేల్చిచెప్పడం వెనుక అసలు కారణమేంటి..? అనే  సందేహం ఇప్పుడు  పార్టీ శ్రేణుల్లోనే కాదు, రాష్ట్ర ప్రజానీకంలో కూడా వ్యక్తమౌతోంది.  దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మాట నుంచి దేశానికి కొత్త ఎజెండా కావాలి అనే జనరలైజ్ స్టేట్ మెంట్    అధినేత కెసిఆర్ నోట వెంట రావడం రాజకీయ విశ్లేషకులను సేతం విస్మయ పరిచింది. కోటలు దాటిన తన మాటలు గడప కూడా దాటకపోవడంపై ప్రజలు నొసలు చిట్లించకుండా ఉండేందుకు, వారి  దృష్టిని తెరాస వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నంగా ఆయన ప్లీనరీ ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.