Publish Date:Apr 24, 2024
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అసలు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) రెండో సారి గెలిచిన తరువాత నుంచే తండ్రీ కొడుకుల మధ్య కనిపించని గ్యాప్ ఏర్పడిందని అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే తాను జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడానికి కేటీఆర్ ను తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చో పెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటీఆర్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడమన్నది మాత్రం జరగలేదు. ఇందుకు చాలా చాలా కారణాలున్నాయి. పార్టీలో కేటీఆర్ కు పూర్తి ఆమోదం లేకపోవడం, తిరుగుబాటు వస్తుందన్న బెదురు, అన్నిటికీ మించి కుటుంబంలోనే అందుకు వ్యతిరేకత వచ్చిందన్న వార్తలు వీటిలో కారణమేదైతేనేం ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కు పట్టాభిషేకం అయితే జరగలేదు.
ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారనీ, కొంత కాలం పాటు ముభావంగా కూడా ఉన్నారనీ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడో సారి గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే అడ్డంకులూ లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాలలోకి దూకేద్దామన్న కేసీఆర్ ఎత్తుగడ గత ఎడిది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఘోరంగా దెబ్బతింది.
అదిగో ఆ క్షణం నుంచీ కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు.
అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్ కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమోచ్చింది? పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఒక వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే... కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-versus-ktr-in-brs-39-174433.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు