Publish Date:Apr 24, 2024
ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం. గన్నవరం.. తెలుగుదేశం కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ముచ్చటగా మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్నారు.
అయితే ఆయన 2019లో పార్టీ పరాజయం తరువాత తెలుగుదేశం వీడి వైసీపీ గూటికి చేరారు. అప్పటికి కానీ ఆయనకు అర్ధం కాలేదు. వరుసగా తన రెండు విజయాలు తెలుగుదేశం బలం కానీ తన బలం కాదని. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ప్రచారం హోరెత్తుతున్న వేళ.. తాను ఎంత నిస్సహాయంగా మిగిలాడో వంశీకి తెలిసివచ్చినట్లైంది. ఈ సారి గన్నవరంలో పోటీ పడుతున్నది పాత ప్రత్యర్థులే. అయితే పార్టీలు మారాయి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
అయితే యార్లగడ్డకు తెలుగుదేశం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండగా, వంశీ మాత్రం వైసీపీలో తన వ్యతిరేక గ్రూపుల సహాయనిరాకరణతో డీలా పడ్డారు. ఇక ఇప్పుడు నామినేషన్ల ఘట్టం దగ్గరకు వచ్చేసరికి యార్లగడ్డ వెంకట్రావు బుధవారం (ఏప్రిల్ 24)న తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన భారీ జనసందోహం చూస్తే గన్నవరంలో యార్లగడ్డ విజయం ఖారారైపోయిందనిపించక మానదు. రాజకీయ సన్యాసం గురించి గతంలోనే ఆలోచించిన వంశీ ఆ ఆలోచన ఎందుకు విరమించుకున్నానా అని మథనపడుతూ ఉంటారని తెలుగుదేశం శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.
యార్లగడ్డ నామినేషన్ సందర్భంగా కూటమి ఐక్యత ఎంత పటిష్టంగా ఉందో మరో సారి రుజువైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాలీలో పాల్గొన్నారు. మరో వైపు ఇప్పటికే వంశీకి సహకారం అందించే ప్రశక్తే లేదని పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టేశాయి. దీంతో వంశీ నామినేషన్ ర్యాలీ వెలవెలపోవడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇది ఊహించే యార్లగడ్డతో పాటే గురువారం ( ఏప్రిల్ 25)న నామినేషన్ దాఖలు చేయాలని, తద్వారా పోటీపోటీ ర్యాలీల పేరుతో గందరగోళం సృష్టించాలన్న వంశీ వ్యూహం బెడిసికొట్టింది. ఒకే రోజు ఇద్దరికీ నామినేషన్ దాఖలుకు రిటర్నింగ్ అధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో యార్లగడ్డ ఒక రోజు ముందే నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దీంతో గురువారం (ఏప్రిల్ 25) వంశీ నామినేషన్ సందర్భంగా ర్యాలీ తీసే సాహసం చేయకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-response-to-yarlagadda-nomination-rally-39-174436.html
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే
ఏపీలో ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె.. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని ఆశపడుతున్నారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవరు
కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం.