Publish Date:Oct 19, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు పది రోజుల పాటు హస్తినలో బస చేసిన ఆయన అక్కడ ఏం చేశారన్నది ఆయన పర్యటన ముగిసి తిరుగు పయనమైనా ఇంకా రహస్యంగానే ఉంది. ఇన్ని రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు అన్న విషయంపై రాజకీయ వర్గాలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలిసారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ తన జాతీయ రాజకీయ జెండా అజెండాను నేషనల్ మీడియాకు వివరిస్తారనీ, వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ, ప్రజా సంఘాల నాయకులతోనూ, ఇతర వర్గాల ప్రముఖులతోనూ జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తారనీ అంతా భావించారు. అయితే ఆయన పది రోజుల హస్తినలో బస చేసినా ఎవరినీ కలిసిన దాఖలాలు లేవు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు.
అన్నిటికీ మించి డిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవిత, మరో బంధువు సంతోష్ లను వెంటబెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్లడంతో తెరచాటు మంత్రాంగం నెరిపి వారిని ఆ కేసు నుంచి బయటపడేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. అయితే వీటిని వేటినీ కేసీఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పది రోజులూ కూడా ఆయన హస్తినలో దాదాపు అజ్ణాతవాసంలో ఉన్నట్లే గడిపారు.
మధ్యలో ఒక సారి సీఎస్ ను, మరో సారి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను పిలిపించుకున్నారు. అలాగే పార్టీ వర్గాల నుంచి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ఉన్నారనీ, అందుకే ఎవరినీ కలవడం లేదనీ ఒక ప్రకటన జారీ చేశారు. అంతే.. అంతకు మించి కేసీఆర్ హస్తినలో బసకు సంబంధించి ఎటువంటి వివరాలూ తెలియరాలేదు. దీంతో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కేసీఆర్ హస్తినలో ఏం చేస్తున్నట్లో అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
రాజకీయ వర్గాలలో కూడా పలు విధాల కేసీఆర్ మౌనంపై చర్చోప చర్చలు జరిగాయి. చివరకు ఆయన హస్తిన పర్యటన ముగించుకుని బుధవారం(అక్టోబర్ 19) హైదరాబాద్ చేరుకున్నట్లు ఆయన పీఆర్వో హజారీ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కేసీఆర్ హస్తిన వెళ్లారు... పది రోజులు బస చేశారు.. తిరిగి వచ్చారు అంతే. చెప్పుకోవడానికి ఇంకే లేదు. దీంతో రాజకీయ వర్గాలలో కేసీఆర్ హస్తిన పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-returned-back-from-delhi-after-10-days-what-he-did-there-39-145706.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.