అసెంబ్లీకి వెళ్లుటయా.. మానుటయా.. కింకర్తవ్యం?.. కేసీఆర్ మథనం!?

Publish Date:Aug 6, 2025

Advertisement

అటు చూస్తే బాదం హల్వా,  ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగిందొక విద్యార్థికి.. అంటారు మహాకవి శ్రీశ్రీ తన సంధ్యా సమస్యలు కవితలో.. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎటూ తేల్చుకోలేని సమస్యతో మథనపడుతున్నారు.  ఔను ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు సమస్యే ఏదురైంది.   అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్నది తేల్చుకోలేక తీవ్రంగా మథన పడుతున్నారంటున్నారు పరిశీలకులు.  అసలు అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్న సంశయంతో కేసీఆర్ మథనపడటమేంటి? అసలాయన గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత రెండు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లిందే లేదుగా అనుకుంటున్నారా? అ విషయానికి వద్దాం. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావుకు గొప్ప చిక్కే వచ్చి పడింది. పార్టీ  పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించలేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ హాజరవ్వాలా వద్దా అన్న మీమాంశ ఎందుకంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. 

కాళేశ్వరంలో చాలా అవకతవకలు, అవినీతి జరిగిందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపైనా తెలంగాణ అసెంబ్లీ చర్చించబోతోంది. అయితే ఆ నివేదిక అంతా బూటకమని మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నారు.  నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ నిపుణులు డిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించి ఆ మూడు చాలా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇస్తేదానిని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికనున కాంగ్రెస్ నివేదిక అంటున్నారు. అయితే ఈ  నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు కేసీఆర్ హాజరై నివేదికను ఎండగడతారని చెబుతున్నారు. ఇక్కడే కేసీఆర్ కు చిక్కు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్.. ఇప్పుడు సమావేశాలకు హాజరై తనను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి రెడీ అయిపోవడం, ఒక వేళ నివేదిక ఆధారంగా తనపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు వరకూ వెళ్లైనా న్యాయం కోసం పోరాడతాం అనడంపై పరిశీలకులే కాదు, సామాన్య ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు.  

ఇంతకాలం ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు కాళేశ్వరం కేసు తన మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో తగుదునమ్మా అని అసెంబ్లీకి హాజరై తనను తాను సమర్ధించుకుంటూ గళమెత్తితే ప్రజలకు ఏం సంకేతమించినట్లు అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రిగా, పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగా, ఒక ఎమెల్యేగా ఈ ఏడాదిన్నర కాలం కేసీఆర్ ప్రజాసమస్యలపై గళమెత్తి, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించి ఉంటే.. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో తనను తాను సమర్ధించుకొనే విషయంలో జనం నుంచి ఎటువంటి అభ్యంతరాలూ వచ్చి ఉండేవి కావు. కానీ అలా చేయకుండా కేవలం తన సమస్యే రాష్ట్ర సమస్య అన్నట్లు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వాన్నీ, కమిషన్ నివేదికనూ సభ వేదికగా ఎండగడతానంటే జనం తనను స్వార్థపరుడిగా భావిస్తారన్న సంశయం కేసీఆర్ ను వేధిస్తున్నదంటున్నారు. అలాగని కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకూ డుమ్మా కొడితే.. తన హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక భయపడి ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న నిందను మోయాల్సి వస్తుందన్న భావనా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని అంటున్నారు. దీంతో కేసీఆర్ ఎంచేయాలో తెలియని పరిస్థితుల్లో దిక్కుతోచక ఆందోళనకు గురౌతున్నారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.  

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.