Publish Date:Nov 10, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారు నడిపారు. ఔను తన ఫామ్ హౌస్ లో బెంజ్ కారు నడిపి అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. మీడియాకే కాదు, పార్టీ నేతలకు, శ్రేణులకూ కూడా అందుబాటులో లేకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
దీంతో పార్టీ శ్రేణులలో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆందోళనలలు చేపడుతున్నప్పటికీ, అవి పెద్దగా ప్రభావమంతంగా లేవు. కేసీఆర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనక పోవడం, అసలు రాజకీయాలను వదిలేశారా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది జనవరి నుంచీ తాను పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకుంటాననీ, రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తాననీ ప్రకటించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఇంత కాలం మౌనంగా ఉన్నానని చెప్పిన కేసీఆర్.. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాననీ చెప్పారు. దీంతో క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ అన్నట్లుగా వచ్చే ఏడాది జనవరిని నుంచీ క్రీయాశీలంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పరాజయం తరువాత ఆయన ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు. ఆ రోజు రేవంత్ సర్కార్ బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ఆ తరువాత సైలెంటైపోయారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు ఇలా ఏ కీలక అంశంపైనా ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ క్రియాశీలం అవునానని ప్రకటించినా పార్టీ నేతలలో కొందరికి నమ్మకం కుదరడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఫామ్ హౌస్ లో కారు నడిపారు. తద్వారా గ్యారేజీలోంచి కారును బయటకు తీసుకువస్తాననీ, ఇక కారు స్పీడ్ తో కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తిపోవడం ఖాయమనీ సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైగర్ ఈజ్ బ్యాక్ బీఆర్ఎస్ శ్రేణులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కారు జోరును అడ్డుకోవడం రేవంత్ వల్ల కాదని వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-drives-car-in-farmhouse-25-188171.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.