స్వోత్కర్ష.. కేంద్రంపై నింద.. రైతు సంఘాలతో కేసీఆర్ సమావేశం సారాంశమిదే!
Publish Date:Aug 28, 2022
Advertisement
కేసీఆర్ సమావేశమంటే స్కోత్కర్ష.. పరనింద మాత్రమే. సభ ఏదైనా, సమావేశం ఏదైనా, ఎవరితో భేటీ అయినా కేసీఆర్ చెప్పే ఆవుకథ ఒక్కటే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానీ అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని సంక్షేమ కార్యక్రమాు తెలంగాణలో చేపట్టాం.. కేంద్ర ప్రభుత్వం కనీసం ఊహకు కూడా రాని అభివృద్శి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. అది భరించలేకే.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ వ్యవసాయ విధానాలు బహు భేషుగ్గా ఉన్నాయనీ, తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం బహు గొప్పగా విలసిల్లుతోందనీ దేశ వ్యాప్తంగా చాటేందుకు కేసీఆర్ జాతీయ స్థాయిలో రైతు సంఘాల ప్రతినిధులను తెలంగాణకు పిలిపించుకుని మరీ సమావేవమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగ సారాంశమంతా ముందుగా చెప్పుకున్నట్లు ఆవు కథే. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేస్తోందని అహో.. ఓహో పొగుడు కోవడం వచ్చిన వారి చేత పొగిడించుకోవడం ఇందు కోసం కేసీఆర్కి ఎవరినైనా సరే ప్రగతి భవన్ కు ఆహ్వానిస్తారు. పిలిపించుకుంటారు.బ్రహ్మాండమైన ఆతిధ్యం ఇస్తారు. గత మూడేళ్లుగా కమ్యూనిస్టులను అత్యంత చులకనగా మాట్లాడిన కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడాయనకు కలిగింది. అందుకే వారికి ఇటీవల ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. రాజమర్యాదలతో విందు దొరికింది. అదంతా మునుగోడు మహాత్మ్యమే అని విమర్శకులు అన్నా.. కేసీఆర్ కు వారితో అంతకు మించిన అవసరమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిన. ఇప్పటికీ విభజనపై విమర్శలు గుప్పిస్తున్న ఉండల్లికీ, అలాంటి చాలా మందికీ ఇటీలి కాలంలో ప్రగతి భవన్ ద్వారాలు బార్లా తెరుచుకుంటున్నాయి. అదంతా వారి గొప్పదనం కాదు. వారితో కేసీఆర్ కు అవసరం పడటమే కారణం. అది కాస్తా తీరిపోతే... మళ్లీ వారికి ప్రగతి భవన్ దర్శనం గగనమే అవుతుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఉత్తరాది రైతు సంఘాల నేతలతోన కేసీఆర్కు అవసరం వచ్చింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లి వీరంతా ప్రచారం చేయాలి. అందుకే ఆహ్వానించారు. రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని వారు భోజనం తర్వాత హామీ ఇచ్చారు. అదీ సంగతి. ఈ భేటీ వేదికగా కేసీఆర్.. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశంలో తీర్మానం చేసింది. కాదు కాదు చేయించారు. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోడల్ అత్యవసరం అని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాలని అందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని రైతు నేతలు కోరారు. ఉత్తర, దక్షిణ భారత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం, రైతు సంక్షేమంపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళైనా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూడాల్సి రావడం దారుణం అన్నారు. దేశంలో మొత్తం 70వేల టీఎంసీల నీటి వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు కేసీఆర్. తాగునీరు, సాగునీరుకు 50వేల టీఎంసీల నీరు సరిపోతుందని.. అయినా ఇంకా వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగా రాష్ట్రం.. రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ సాగునీటిని అందిస్తున్నప్పుడు ఈ పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు కేసీఆర్. రైతులు కూర్చుని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? అని నిలదీశారు. రైతు సంఘాల నేతలకు ప్రగతిభవన్ లోనే అల్పాహారం, లంచ్ ఏర్పాటు చేశారు. రాకేశ్ టికాయత్ ఆదివారం ప్రగతి భవన్ కు రానున్నారు. ఆదివారం కూడా రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది. మొత్తం 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/kcr-criticises-center-in-the-meet-with-farmer-associations-39-142793.html





