వైకుంఠపురం టు శ్రీశైలం... బీజేపీపై ఉమ్మడి పోరుకు కేసీఆర్-జగన్ నిర్ణయం

Publish Date:Sep 24, 2019

Advertisement

 

ముచ్చటగా మూడోసారి సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా, గోదావరి జలాల వినియోగంపై చర్చించారు. గోదావరి బ్యాక్ వాటర్‌ను నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడం ద్వారా ఇటు తెలంగాణ, అటు రాయలసీమకు నీళ్లందించాలన్న ప్రతిపాదనపై దాదాపు నాలుగున్నర గంటలపాటు డిస్కషన్స్‌ చేశారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడం ద్వారా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు.... ఏపీలో రాయలసీమకు తాగు-సాగునీరు అందించాలని భావిస్తున్నారు. గోదావరి జలాల తరలింపుపై ప్రధానంగా నాలుగు మార్గాలను ప్రతిపాదించారు. అయితే, అందులో వైకుంఠపురం నుంచి పులిచింతల... అక్కడ్నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడమే ఇరురాష్ట్రాలకు ఉత్తమ మార్గమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్గంలో మాత్రమే, కొంతలో కొంత తక్కువ వ్యయంతో గోదావరి జలాల తరలింపు చేపట్టవచ్చని అంచనాకి వచ్చారు. వైకుంఠపురం టు నాగార్జునసాగర్, శ్రీశైలం మార్గంలో గోదావరి జలాల తరలింపు చేపట్టడానికి ప్రాథమికంగా 40వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని లెక్కగట్టారు.

ఇక, విభజన సమస్యలు, 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపైనా కేసీఆర్, జగన్ చర్చించారు. అలాగే, విజయవాడలోని ఆప్మెల్ ఆస్తుల పంపకాలు, ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షవాత వైఖరి చూపుతోందని కేసీఆర్, జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అంతేకాదు, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున... కాషాయదళాన్ని కలిసి ఎదుర్కోవాలని కేసీఆర్-జగన్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

By
en-us Political News

  
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.