ఎన్నికలలో తెరాసకు పోటీ వద్దంటున్న కేసీఆర్

Publish Date:Apr 2, 2014

Advertisement

 

మెదక్ జిల్లా అందోల్‌లో నిన్న జరిగిన తెరాస తెలంగాణా విజయోత్సవ సభలో మాటల మాంత్రికుడు కేసీఆర్ ఒకపక్క ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రాజేస్తూనే, తనకు అధికారం కట్టబెడితే ఒక్కరూపాయి కూడ అవినీతిలేని పాలన అందిస్తానని సరికొత్త పల్లవి అందుకొన్నారు. తెరాసను ‘ఇంటి పార్టీగా’ ప్రజలు స్వీకరించాలని కోరారు. తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే పరిపాలించుకొంటూ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకొంటున్నాయని, అందువల్ల తెలంగాణలోకూడా ఇంటి పార్టీ- తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఎంతో దైర్యంతో పోరాడి తెలంగాణా సాధించిన తానే తెలంగాణకు ‘కొత్త మేస్త్రిగా’ ‘సేవ’ చేసుకొంటానని విన్నవించుకొన్నారు.

 

ఇంతకాలంగా ఆంధ్రా పార్టీలు, ఆంద్ర నాయకులు కలిసి తెలంగాణా నీళ్ళను, భూములను, ప్రజలను కూడా దోచుకొన్నారని అందువలన తెలంగాణాలో ఇకపై ఆంధ్రా పార్టీలకు ‘నో ఎంట్రీ’ అని బోర్డు కూడా పెట్టేసారు. వాటికి కూడా ఉద్యోగులలాగే ఆప్షన్స్ లేవని, తెలంగాణా విడిచి వెళ్లిపోవల్సిందేనని ప్రకటించేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్ధులకు ‘కేజీ టు పీజీ’ ఉచితవిద్య, రైతులకు రుణమాఫీ, గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్స్ తదితర అనేక హామీలు గుప్పించారు.

 

కేసీఆర్ ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ఇచ్చుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఎన్నికల బరిలో తమ పార్టీకి పోటీగా అసలు ప్రత్యర్ధులే ఉండకూడదని భావిస్తున్నట్లుంది. తెలంగాణాలో తమకంటే చాలా బలంగా ఉన్నకాంగ్రెస్ పార్టీకి అవినీతి ముద్ర, తెదేపాకు ఆంధ్రా పార్టీ ముద్రవేసేసి ప్రజలు ఓటేయడానికి అనర్హమయినవని ఆయనే డిసైడ్ చేసేసారు. పనిలోపనిగా తన తెరాసకు ‘ఇంటి పార్టీ ముద్ర’ గుద్దేసుకొని ఇది ప్రజల పార్టీయేనని నమ్మమని చెపుతున్నారు.

 

మొన్నటిదాకా దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు తానే ‘తెలంగాణకు కొత్త మేస్త్రిగా’ సేవ చేసుకొంటానని చెపుతున్నారు. కేసీఆర్ తను చాలా గొప్ప త్యాగమూర్తిన్ని భావించవచ్చుగాక, కానీ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు యంపీ, యం.యల్యే. కేంద్రమంత్రులుగా పనిచేసినప్పటికీ వారు తెలంగాణా రైతన్నలకు, నేతన్నలకు, బీడీ కార్మీకులకి, గల్ఫ్ బాధితులకి గానీ వారు చేసిందేమీ లేదు. అయినప్పటికీ తెలంగాణా ప్రజలు కూడా ఆయన నిజంగా త్యాగమూర్తేనని భావిస్తే ఆయన తన గురించి, తన పార్టీ గురించి ఇంతగా స్వోత్కర్ష చేసుకోనవసరం లేదు.

 

తెలంగాణా సాధనలో ఆయన పాత్రను, తెరాస పాత్రను ఎవరూ కూడా ప్రశ్నించలేరు. కానీ వారు అందుకు ఎంచుకొన్న విద్వేష ప్రచార మార్గం, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు, బలవంతపు వసూళ్ళు, పార్టీలో సాగుతున్న కుటుంబ పెత్తనం వలననే నేడు ఆయన ప్రజలను ఓట్ల కోసం ఈవిధంగా వేడుకోవలసి వస్తోంది. తెలంగాణా ఏర్పడితే కాపలా కుక్క పాత్ర పోషిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అధికారం పంచుకొంటామని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. అందుకోసమే మళ్ళీ ఆయన ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు ప్రజల హృదయాలలో విద్వేష భావాలు నింపుతూ స్వచ్చమయిన తెలంగాణా ప్రజల హృదయాలను కూడా కలుషితం చేస్తున్నారు.

 

ఇంత పదవీ లాలస కలిగి, మాట నిలకడలేని వ్యక్తి కేసీఆర్ నేటికీ ప్రజలను తన మాటకారితనంతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ తను అధికారంలో రావడం కోసం వేరే ఏ పార్టీలు పోటీలో ఉండకూడదనే దొరల అహంకారం, ఇంకా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కావు. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకు తగ్గట్టుగా ఆయన తీరు మార్చుకొని ప్రజల వద్దకు వెళితే వారే ఆయనను నెత్తిన పెట్టుకొంటారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.