తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలన్నీ కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. తండ్రికి రాసిన లేఖ లీక్ తరువాత జరిగిన పరిణామాలు ఆమె బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడం ఖాయమన్న సంకేతాలనే ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన, ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఆమె ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఎక్కడా బీఆర్ఎస్ పేరు కానీ, బీఆర్ఎస్ జెండా కానీ లేదు. అయితే కేసీఆర్, జయశంకర్ ఫొటోలు మాత్రం ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు ఆమె తాజాగా ప్రారంభించిన జాగృతి కార్యాలయమే ఒక వేళ ఆమె రాజకీయ పార్టీ ప్రారంభిస్తే.. ఆ పార్టీ కార్యాలయంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో కవిత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.
అయితే ఇక్కడే ఒక సందేహాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ కు దూరంగా వేస్తున్న రాజకీయ అడుగుల వెనుక ఆమె తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఉందా అన్నదే అ సందేహం. మామూలుగా అయితే కవిత తీరు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ కు స్పష్టమైన హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఆమె బాహాటంగానే తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో కేసీఆర్ ను దేవుడిగా అభివర్ణించారు.
ఇప్పుడు కవిత తన సొంత పార్టీని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? తమిళనాడులో డీఎంకే, ఏఐఏడిఎంకేలా బీఆర్ఎస్ రెండుగా నిట్టనిలువుగా చీలిపోతుందా? బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలను కవిత తన వైపునకు తిప్పుకోగలరా? అంటే ఆమెకు అంత సీన్ లేదన్న సమాధానమే అన్ని వర్గాల నుంచీ వస్తోంది. అయితే తమిళనాడులో డీఎంకే అన్నాడీఎంకేలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు అవకాశం, చోటు లేకుండా చేశాయి. ఇప్పుడు కవిత వేరుకుంపటి కూడా అలాంటి వాతావరణం సృష్టించడానికేనా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అదే కారణమై ఉంటే మాత్రం కవిత అడుగుల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిని నిర్వహించేంత స్థాయి కవితకు లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ యోచన, ప్రయత్నాల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-kalvakuntla-political-steps-kar-strategy-39-199138.html
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో డీఐజీ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.