కాంగ్రెస్ గూటికి  క‌విత‌!

Publish Date:Oct 17, 2022

Advertisement

తెలంగాణా రాజ‌కీయాల ప‌రిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ బీఆర్ ఎస్‌గా మారిపోయింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి దూకి కేంద్రానికి గ‌ట్టి స‌వాలు విసిరి త‌న ప్రాధా న్య‌త‌ను దేశ‌మంతా విస్త‌రించేలా చేయ‌డానికి ముంద‌డుగు వేశారు. అయితే ఈ స‌మ‌యంలోనే ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డ‌టం, అందులో కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట క‌విత త‌దిత‌రుల కీల‌క‌పాత్ర గురించి వార్త‌లు దేశ‌మంత‌టా విస్త‌రించ‌డం ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించు కుంది. ఆమె పాత్ర ఎంత‌వ‌ర‌కూ ఉంది, అది కేసీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీద ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది తెలంగాణా రాజ‌కీయాల్లో త‌న దైన శైలితో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న, కేసీఆర్ సోద‌రుని కుమార్తె తెలంగాణా ఫైర్‌బ్రాండ్ ర‌మ్యారావు,  క‌విత కాంగ్రెస్  ఆశ్ర‌యించ‌డానికే ఎంతో అవ‌కాశం ఉంద‌న్నారు. ఆమె కాంగ్రెస్‌తో లోపాయ కారి ఒప్పందాలు చాలాకాలం క్రిత‌మే చేసుకుంద‌ని అన్నారు. 

శ‌నివారం తెలుగువ‌న్‌తో ర‌మ్యారావు ప్ర‌స్తుత రాజ‌కీయాప‌రిణామాల‌గురించి చ‌ర్చించారు. ఈ సంద‌ ర్భంగా ఆమె మాట్లాడుతూ, అస‌లు తెలంగాణాలో టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చే స‌మ‌యానికే క‌విత బీజేపీ వారితో సంబంధాలు ప‌టిష్ట‌ప‌రుచుకుంద‌ని ర‌మ్యారావు అన్నారు.  రెండో పర్యాయం టీ ఆర్ ఎస్‌ రాకున్నా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నార‌న్నారు. అం దువ‌ల్ల‌నే ఆమె ఎంపీగా గెలిచిన నిజామా బాద్ నుంచే మ‌ళ్లీ పోటీచేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఇక్క డ త‌మ పార్టీ రాకున్నా కేంద్రంలో బీజేపీ పార్టీతో ఉన్న స‌త్సంబంధాలు క‌విత‌కు మ‌ద్ద‌తునిస్తాయన్న ధైర్యం ఆమెకు  ఎప్ప‌టి నుం చో ఉంద‌న్నారు. అప్ప‌ట్లో అమిత్ షా ని మ‌రో కీల‌క నాయ‌కునితో సంప్ర దించార‌ని, త‌మ స్థానం సు స్థిరప‌ర‌చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని  ర‌మ్యారావు  స్ప‌ష్టం చేశారు.  

లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌స్తావిస్తూ, మ‌రీ విస్త‌రించేంత‌వ‌ర‌కూ వాస్త‌వానికి కేసీఆర్‌కు తెలియ ద‌ని, దాని సీరియ‌స్ నెస్ బ‌య‌ట‌ప‌డ‌డంతో కుమార్తెను ఆ ఉచ్చునుంచి బ‌య‌ట‌ప‌డేసేటందుకు ఆయ‌న తీవ్ర కృషిచేస్తున్నార‌ని ర‌మ్యారావు అన్నారు. ఢిల్లీలో నాయ‌కుల‌ను సంప్ర‌దించి కేసు తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారన్నారు. అయితే మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌ మ‌యిన ఈ స‌మయంలో కేసు ప్ర‌భావం ఉంటుంద‌ని అంటూనే తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికే ప‌రువు కాపాడు కునే య‌త్నా ల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ యాత్ర‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి క‌విత పాత్ర కీల‌క‌మా కాదా అన్న‌ది ఇంకా తేల‌వ‌ల‌సి ఉంద‌ని, అయితే ఈసీ ఏసి బీ దాడుల‌తో ఆమె చుట్టూ కేసు బిగియ‌డం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ  క‌విత స‌న్నిహితుడు అప్రోవ‌ల్‌గా మారితేనే ఆమెకు ప్ర‌మాదం ఉండ‌వ‌చ్చుగాని అప్ప‌టివర‌కూ ఉండ ద‌న్నారు. 

అయితే క‌విత నేరుగా ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ని సంప్ర‌తించార‌ని, ఆయ‌న ఆమెను స్కామ్ నుంచి ర‌క్షిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉంద‌ని ర‌మ్యారావు అన్నారు. అంచేత కేసీఆర్ ప్ర‌య‌త్నాల కంటే మోహ న్ భ‌గ‌వ‌త్ క‌రుణాక‌టాక్షాలే ఆమెను కాపాడ‌తాయ‌న్నారు. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ కేంద్రం మీద భారీ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో అదెంత‌వ‌ర‌కూ సాధ్య మ‌న్న ప్ర‌శ్న‌క స‌మాధానం చెబుతూ, మునుగోడు ఎన్నిక‌ల ముందు పార్టీ ఇబ్బందిప‌డ‌కుండా బీజేపీ వారు కూడా జాగ్ర త్త‌లు తీసుకుంటార‌ని, ఆమెపై చ‌ర్య‌కు ఉప‌క్ర‌మిస్తే మునుగోడులో సెంటిమెంట్ మీద టీఆర్ ఎస్ గెలిచే అవ‌కాశాలుంటాయి గ‌నుక టీఆర్ ఎస్‌పై దాడి అంత వేడిగా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు. ప‌రిస్థితుల‌ను అను స‌రించే అంతా జ‌రిగిపోతుందే త‌ప్ప వెంట‌నే చ‌ర్య‌ల‌కు దిగితే కేంద్రం కూడా చిక్కుల్లో ప‌డుతుంద‌నే వారు ఆలోచిస్తారన్నారు. 

కేటీఆర్‌, కేసీఆర్ ల మ‌ధ్య విభేదాల గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, అలాంటిదేమీ లేద‌ని, అసెంబ్లీకి ఎవ‌రు ముందు రావాలి, ఎవ‌రు త‌ర్వాత రావాల‌న్న‌దేమీ ఉండ‌ద‌ని, పైగా ఒక‌రు లేని స‌మ‌యంలో మ‌రొక‌రు రావ‌డం అనేది ఉండ‌ద‌న్నారు. విభేదాల‌కు ఆస్కారం లేద‌ని, కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళుతున్న‌ప్పుడు కేటీఆర్‌ను ఇక్క‌డ ముఖ్య‌మంత్రి చేసి పార్టీ బాధ్య‌త‌ను పూర్తిగా ఆయ‌న చేతుల్లో పెట్టే యోచ‌న‌లో ఉన్న‌పుడు విబేదాల‌కు ఆస్కారం ఉండ‌దని ర‌మ్యా రావు అన్నారు. కేంద్రంలో బీజేపీని ఎదు ర్కొన‌డానికి ప్ర‌తిప‌క్షాల‌తో స్నేహ‌సంబంధాలు మ‌రింత మెరుగుప‌ర్చుకుని యుద్ధానికి స‌న్న‌ధ్ద‌మ‌వుతున్నార‌నే అనాలి. అలా ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తో క‌లిసి ఇక్క‌డ త‌న కుమారుడు కేటీఆర్ కు ఎలాంటి ఎదురుదాడి లేకుండా చేసుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వి నుంచి తొల‌గింప చేయ‌వ‌చ్చు. ఫ‌లితంగా తెలంగాణాలో బీఆర్ ఎస్‌, కేటీఆర్ ప్ర‌భుత్వానికి అడ్డంకులు ఉండ కుండా పోతా య‌న్న‌ది ఆయ‌న వ్యూహంలో భాగం కావ‌చ్చున‌న్నారు. 

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.