బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో విభేదాలు ఇక ఇసుమంతైనా దాపరికం లేకుండా రచ్చకెక్కాయి. కేసీఆర్ కుమార్తె కవిత శషబిషలు లేకుండా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా బీఆర్ఎస్ ను, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆధర్ ను టార్టెట్ చేసి విమర్శలతో చెలరేగిపోతున్నారు. అంతే కాదు.. ఇక తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా మద్దతుగా గళమెత్తడానికి కూడా అమె పెద్ద సుముఖంగా లేరన్న సంకేతాలిస్తున్నారు.
తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునేందుకు వ్యూహరచన చేసేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ఆ సమావేశానికి కవిత దూరంగా ఉన్నారు. పార్టీ రానీయలేదా? ఆమె దూరం జరిగారా అన్నది పక్కన పెడితే.. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లోఅత్యంత కీలకంగా ఉన్న కవిత.. కీలకమైన కాళేశ్వరం విషయంలో పార్టీ వ్యూహరచనకు దూరం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేననీ, అక్రమాలకు కారకులు వీరే అంటే కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ నేత ఈటల పేర్లను కూడా కమిషన్ నివేదిక వెల్లడించినట్లు సమాచారం. ఈ నివేదక తెలంగాణలో కలకలం రేపుతుండగా, బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది. ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాం హౌస్ లో సోమవారం ( ఆగస్టు 4) పార్టీ కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కవిత దూరంగా ఉన్నారు. లేదా కేసీఆర్ దూరంగా ఉంచారు.
ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక భేటీ జరుగుతుంటే.. కవిత మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో నిరశన దీక్షలో కూర్చున్నారు. వాస్తవానికి కవిత మూడు రోజుల నిరశన దీక్ష ప్రకటించినప్పటికీ.. కోర్టు సూచనతో కవిత ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాళేశ్వరం నివేదికపై ఏమీ మాట్లాడలేదు. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ నివేదిక తో కేసీఆర్ అరెస్టు ఎదుర్కొంటున్నారన్న విషయాలను ఆమె ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపై తిరుగుబావుటా ఎగురవేసిన కవిత.. తండ్రి కేటీఆర్ కు కూడా దూరంగా ఉంటూనే తన సొంత బాటలో నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా కవిత.. కల్వకుంట్ల కుటుంబానికి దూరమయ్యారనడానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ఆమె మాట్లాడకపోవడమే తార్కానమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-distance-herself-with-kalvakuntla-family-39-203523.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.