కేసీఆర్ కోసం ధర్నా.. బీఆర్ఎస్ కాదు.. తెలంగాణ జాగృతి!

Publish Date:May 31, 2025

Advertisement

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.

కేసీఆర్ ఈ నెల 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  అంతకంటే ఒక రోజు ముందు అంటే  జూన్ 4న కవిత ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఇప్పటికే కవిత పార్టీ లైన్ కు భిన్నంగా వెడుతున్నారు. తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం బీఆర్ఎస్ లో చీలికకు సంకేతంగా నిలిస్తే.. ఈ తరువాత మీడియాతో చిట్ చాట్ అంటూ ఆమె తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు.. ఆమెకు బీఆర్ఎస్ తలుపులు మూసేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ జాగృతి బ్యానర్ తో సొంతంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు.

ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఆ అడుగుల్లో మొదటిదని చెప్పవచ్చు.  చావు నోట్లో తల పెట్టి.. తెలంగాణ సాధించిన  ప్రజానాయకుడు కేసీఆర్‌పై రాజకీయ కుట్రలు సాగడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నా కు పిలుపు నిచ్చారు. అలాగే.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత శనివారం ప్రారంభించారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  చాటిచెప్పడం, మహిళల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం  పోరాడుతున్న తెలంగాణ జాగృతి సంస్థ, ఇక కొత్త కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా ఉధృతంగా నిర్వహించనుందని అంటున్నారు.  

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు.
ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ.
కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
శనివారం జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది.
హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.