మూడు పార్టీలు.. ఒకటే ముచ్చట

Publish Date:May 31, 2025

Advertisement

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలు బజారు పడ్డాయి. పతాక స్థాయికి చేరాయి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు, పార్టీ, కుటుంబ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు మరింతగా ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయాలను రక్తి కట్టిస్తునాయి.  అయితే, అంతర్గత కుమ్ములాటలు ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమా అంటే కాదు..  అన్ని పార్టీలలో ఉన్నదే.. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలలోనూ అదే పరిస్థితి వుంది.  మూడు పార్టీలలో ఒకటే ముచ్చట నడుస్తోంది. చిన్న గీత పెద్ద గీత అంతే, అదొక్కటే తేడా, మిగిలినదంతా సేమ్  టూ సేమ్. 

అవును..  అన్ని పార్టీలలో, ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీలోనూ ధిక్కార స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలను చిన్నా పెద్ద నాయకులు ప్రశ్నిస్తున్నారు. గీత దాటుతున్నారు. నేతలను నిలదీస్తునారు. అంతే కాదు.. ఇదొక అంటూ వ్యాధిలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, ఒక నాయకుడి నుంచి మరో నాయకుడికి   పాకుతోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలకు పదవీ కాంక్ష ఒక ప్రధాన కారణం అయితే..  రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్య పరిధి, పరిమితి రోజురోజుకు కుచించుకు పోవడం మరో ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవీ కాంక్ష పై కొచ్చినప్పుడు బంధాలు, బాంధవ్యాలు కూడా కొట్టుకు పోతున్నాయని అంటున్నారు. నిజానికి, ఈ రోజు బీఆర్ఎస్ లో  జరుగుతున్న పరిణామాలను గమనిస్తే,  ఇది ఫక్తు పదహారణాల కుటుంబ కలహాల చిత్రం లా సాగుతోందని అంటున్నారు. అన్నా, చెల్లి మధ్య కుర్చీలాటగా మొదలైన వివాదం మెల్లమెల్లగా కుటుంబ పరిధిని, పార్టీ పరిధిని దాటి ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది. ఒక చోటి నుంచి ఒక చోటికి పాకుతూ.. పక్క దారులు పట్టి పోతోంది.  రాష్ట్ర హద్దులు దాటి  జాతీయ మీడియాలోనూ చర్చకు వస్తున్నా పెద్దాయన కేసీఆర్  పెదవి విప్పక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. నిజానికి.. ఆయన తలచుకుంటే, సమస్య ఇంత వరకు వచ్చేది కాదని, అయినా ఆయన మౌనంగా ఉండడమే కాకుండా, మధ్య వర్తిత్వం జరిపేందుకు ముందుకు వచ్చిన కుటుంబ, పార్టీ పెద్దలకు కూడా పర్మిషన్ ఇవ్వ లేదని అంటున్నారు. మరోవంక కవిత, కేసీఆర్ ను కలిసే  అవకాశం వచ్చినా కలవలేక పోయానని,అంటున్నారు. 

మరోవంక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత చేసిన కామెంట్ బీజేపీలో చిచ్చు పెట్టింది. అంతో ఇంతో ఇంకా క్రమశిక్షణ బతికున్న పార్టీగా భావించే బీజేపీలోనూ కవిత కామెంట్ నిప్పు పెట్టింది. ఫైర్ బ్రాండ్ ఎమ్మల్యేగా ముద్ర వేసుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  కవిత కామెంట్ ను ఎండార్స్ చేశారు. ఆమె చెప్పింది సత్యమని సర్టిఫికేట్ ఇచ్చారు.  అంతే కాదు.. రాష్ట్ర అపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. సరైన రేటు ఇస్తే, ప్లేటు మార్చేందుకు తమ పార్టీ నాయకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారని అన్నారు. ఆయన ఒకరనే కాదు..  కవిత ఇష్యూలో వేలు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించినా..  బీజేపీ నాయకులు ఎవరికి  వారుగానే సొంత అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నారు. కవిత విషయంలోనే కాదు.. అంతర్గత కుమ్ములాటల కారణంగానే పార్టీ  అధ్యక్ష ఎన్నిక ఒక అంతులేని కథల సాగుతోంది. 

ఇక కాంగ్రెస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ముందు అసమ్మతి పుట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది అంటే అందులో తప్పులేదు. అదేమంటే,  మా పార్టీలో  అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ అంటారు. అందుకే.. పార్టీ ఎమ్మెల్సీ సభలోనే  ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. ఎమ్మెల్యేలు, నాయకులు పదవుల కోసం గాంధీ భవన్  మెట్ల మీదనే ధర్నా చేస్తారు. అంతవరకు ఎందుకు.. అంతర్గత కుమ్ములాటల కారణం గానే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినా ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కనీసం పీసీసీ  ఏర్పాటుకు కూడా మీన మేషాలు లెక్క పెట్టవలసి వస్తోంది.  సో. అంతర్గత కుమ్ములాటల విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట ..అంతర్గత ప్రజాస్వామ్యం లేక పోవడమే ఈ పరిస్థితికి కారణమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన భక్తులు సమయమనం కోల్పోయి నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు.
ఆయ‌నొక మంత్రి. ఈయ‌నా మంత్రే. ఒక‌రు దేవాదాయం, మ‌రొక‌రు మున్సిప‌ల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చ‌రిత్ర గ‌లిగిన విద్యా సంస్థ‌లుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్క‌డ చ‌దువుకున్న వారే అన్న హిస్ట‌రీ సైతం క‌లిగి ఉందీ ప్రాంగ‌ణం.
దలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది. ఇక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది.
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు.
ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది.
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.
నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.