కమల్ కు కష్టాలు తీరేనా..విశ్వరూపం విడుదలయ్యేనా?

Publish Date:Feb 1, 2013

Advertisement

 

కర్ణుడు చావుకి వేయి కారణాలు, వేయి శాపాలు అన్నట్లుగానే కమల్ హస్సన్ విశ్వరూపం తమిళ్ వెర్షన్ సినిమా విడుదలకి కూడా వేయి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయన ఎంత పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నపటికీ ఆయన సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు.

 

నిన్న మొన్నటివరకు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అయన సినిమాకి సైందవుడిలా అడ్డుపడిందని అందరూ ఆరోపిస్తే కొంచెం వెనక్కి తగ్గిన ఆమె, తానే స్వయంగా ఆయనకీ, సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ముస్లిం నేతలకీ మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకు వచ్చారు. కమల్ హస్సన్ కూడా అందుకు చాలా సంతోషిస్తూ ఇక రేపోమాపో తన సినిమా విడుదల అయిపోతుందని భావిస్తూ, ముస్లిం నేతలు కోరినట్లు తన సినిమా నుండి వారు అభ్యంతరం చెప్పిన 9 నిమిషాల సన్నివేశాలు మొత్తం తీసేస్తానని ప్రకటించారు.

 

ఈ రోజు (శుక్రవారం) వారితో కలిసి విశ్వరూపం సినిమా చూసిన తరువాత వారు చెప్పిన సన్నివేశాలు తొలగించవలసిఉంది. అయితే, కమల్ హస్సన్ తనకు బదులుగా వేరే మరొకరిని పంపించడంతో ముస్లిం నేతలు ఆయన స్వయంగా వస్తే తప్ప సినిమా చూడమని చెప్పి వెళ్ళిపోయారు. తమిళనాడులో అందరికీ ఆరాధ్యుడయిన రజనీకాంత్ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది.

 

ఇప్పటికే వారి ధోరణితో విసిగిపోయున్న కమల్ హస్సన్, వారితో కలిసి కూర్చొని వారు తన సినిమాలో తొలగించవలసిన సన్నివేశాలను ఒకటోకటిగా వారు చెప్పుకుపోతుంటే, అవి వినే ఓపిక నశించడంవల్లనే ఆయన వెళ్లి ఉండకపోవచ్చును. అయినా, వారు చెప్పినవి తొలగించేందుకు అంగీకారం తెలినప్పుడు, ఇంకా సమస్యని సాగదీయాలని వారు ప్రయత్నించడం ఎవరూ కూడా హర్షించరు. ఇదంతా చూస్తుంటే, తెగే వరకూ తాడు లాగకూడదని వారు గ్రహించకపోవడం వల్లనే ఈవిధంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. తన సినిమా విడుదల చేసుకోవాలనుకొంటే తప్పనిసరిగా వారి షరతులకు అంగీకరించక తప్పని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అయితే, ఆయనకీ అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.

 

ఇది ఆయననే కాక, సినిమా పరిశ్రమకు చెందిన వారినందరినీ, ఆయన అభిమానులనీ కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన తన సినిమాకి, తన కృషికి ప్రశంసలు దక్కకపోగా, ఈ విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమాయే విడుదలచేసుకోలేని దుస్థితి కల్పించినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు. మరి ఈ కష్టాలు ఇంకా కొనసాగి సినిమా విడుదల కాకపొతే ఆయన ఏ తీవ్రనిర్ణయం తీసుకొన్న ఆశ్చర్యపోనవసరం లేదు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.