కమల్ హస్సన్ కి విశ్వరూపం చూపిస్తున్న జయ, కరుణ

Publish Date:Jan 31, 2013

Advertisement

 

కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాని తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదలచేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటే, మరో పక్క జీవితకాల రాజకీయ ప్రత్యర్దులయిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, డీ.యం.కే. అధ్యక్షుడు కరుణానిధి ఇద్దరూ కూడా కమల హస్సన్ కి తమ రాజకీయ విశ్వరూపం చూపిస్తున్నారు.

 

జయలలిత కు చెందిన ‘జయ టీవీ చానల్’ కి కమల్ తన సినిమా శాటిలయిట్ హక్కులు ఈయనందుకే ఆమె అతని సినిమా విడుదల కాకుండా అడ్డుపడుతోందని ఆరోపిస్తుంటే, తన మీద అటువంటి ఆరోపణలు చేస్తున్న అతనిమీద, అవి ప్రచురించిన పత్రికలమీద కూడా చట్ట పరమయిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె ప్రకటించారు.

 

సినిమాని నిషేదించడం గురించి మాట్లాడుతూ “ విశ్వరూపం సినిమాను 534 ధియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకోన్నారని, తనకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం సినిమా ప్రదర్శించే ప్రాంతాలలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది కనుకనే, రెండు వారాల పాటు సినిమ్మను నిషేదించవలసి వచ్చిందని ఆమె అన్నారు. అల్లర్లు చెలరేగితే అదుపుచేసేందుకు అవసరమయిన కనీస పోలీసు సిబ్బంది కూడా తన వద్ద లేరని అందువల్ల సినిమాను రెండు వారాలు ఆపితే అప్పటికి పరిస్థితులు చక్కబడుతాయనే ఉద్దేశ్యంతోనే నిషేధం విదించవలసి వచ్చిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత తనదే గానీ, కరునానిధిది కాదుకదా, అందుకే ఆయన అంత తేలికగా మాట్లాడుతున్నాడని, జయలలిత విమర్శించారు.

 

కమల్ హస్సన్ పంచె కట్టుకొన్న వ్యక్తి(చిదంబరం)ని ప్రధాన మంత్రిగా చూడాలనుకొంటే అందుకు తనకెందుకు అభ్యంతరం ఉంటుందని, కరుణానిధి చేసిన మరో వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కమల్ హస్సన్ లేగదూడలా నలిగిపోతున్నాడు.

By
en-us Political News

  
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.