Publish Date:Jan 31, 2013
కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాని తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదలచేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటే, మరో పక్క జీవితకాల రాజకీయ ప్రత్యర్దులయిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, డీ.యం.కే. అధ్యక్షుడు కరుణానిధి ఇద్దరూ కూడా కమల హస్సన్ కి తమ రాజకీయ విశ్వరూపం చూపిస్తున్నారు.
జయలలిత కు చెందిన ‘జయ టీవీ చానల్’ కి కమల్ తన సినిమా శాటిలయిట్ హక్కులు ఈయనందుకే ఆమె అతని సినిమా విడుదల కాకుండా అడ్డుపడుతోందని ఆరోపిస్తుంటే, తన మీద అటువంటి ఆరోపణలు చేస్తున్న అతనిమీద, అవి ప్రచురించిన పత్రికలమీద కూడా చట్ట పరమయిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె ప్రకటించారు.
సినిమాని నిషేదించడం గురించి మాట్లాడుతూ “ విశ్వరూపం సినిమాను 534 ధియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకోన్నారని, తనకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం సినిమా ప్రదర్శించే ప్రాంతాలలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది కనుకనే, రెండు వారాల పాటు సినిమ్మను నిషేదించవలసి వచ్చిందని ఆమె అన్నారు. అల్లర్లు చెలరేగితే అదుపుచేసేందుకు అవసరమయిన కనీస పోలీసు సిబ్బంది కూడా తన వద్ద లేరని అందువల్ల సినిమాను రెండు వారాలు ఆపితే అప్పటికి పరిస్థితులు చక్కబడుతాయనే ఉద్దేశ్యంతోనే నిషేధం విదించవలసి వచ్చిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత తనదే గానీ, కరునానిధిది కాదుకదా, అందుకే ఆయన అంత తేలికగా మాట్లాడుతున్నాడని, జయలలిత విమర్శించారు.
కమల్ హస్సన్ పంచె కట్టుకొన్న వ్యక్తి(చిదంబరం)ని ప్రధాన మంత్రిగా చూడాలనుకొంటే అందుకు తనకెందుకు అభ్యంతరం ఉంటుందని, కరుణానిధి చేసిన మరో వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కమల్ హస్సన్ లేగదూడలా నలిగిపోతున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamal-hassan-39-20728.html
ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది.
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.
నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది.
పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంటుంది.
దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది.
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.