Publish Date:Mar 28, 2020
సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ గృహ నిర్భంధంలో ఉన్నట్టు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన ఆరోగ్యం గురించి కనుక్కునేందుకు నాన్స్టాప్గా కాల్స్ వస్తుండడంతో కమల్ కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు. వివరాలలోకి వెళితే చెన్నై నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పొరేషన్ అధికారులు కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే 'ఐసొలేషన్' (గృహ నిర్బంధం) స్టిక్కర్ అంటించారు. అయితే, పొరపాటున దీనిని అతికించామని తెలుసుకున్న అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు.
కమల్ ఇంటికి స్టిక్టర్ అంటించిన వార్త కొద్ది నిమిషాలలోనే వైరల్ కాగా, కమల్కి కరోనా సోకిందని, ఆయన ఐసోలేషన్లో ఉన్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై వివరణ ఇచ్చిన కమల్..నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యుడిని. ఆళ్వారుపేటలోని ఇంట్లో గత కొన్నేళ్లుగా నివసించట్లేదు. కేవలం పార్టీ సమావేశాలు నిర్వహించేందుకుగాను పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం. అంతేకాక గృహ నిర్బంధానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు. ముందు జాగ్రత్తగా ప్రజలంతా ఇతరులకు దూరంగా (సోషల్ డిస్టెన్సింగ్) ఉండాలని నేను కోరాను, అదేవిధంగా నా అంతట నేనుగా ఇతరులకు దూరం పాటిస్తున్నాను. న్యూస్ ఎజెన్సీస్ వార్తని ప్రచురించే ముందు నిజనిజలాంటే తెలుసోవాలని '' అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ రెండు వారాల కిందట ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముంబైలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షర చెన్నైలోనే మరొక ఇంట్లో నివసిస్తున్నారు. కమల్ హాసన్ వేరొక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamal-haasan-condemn-coronavirus-rumours-39-96397.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు