Publish Date:Jan 26, 2026
తెలంగాణ రాజకీయాల్లో కవిత హడావిడి మాములుగా లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రీ అని, తన బావ హరీష్ రావును గుంట నక్క అంటూ ఆమె చేస్తున్న హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఒకప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ని పొలిటికల్ కామెడీగా చిత్రీకరించిన కవిత.. తాజాగా తాను కూడా అదే పాత్ర పోషిస్తున్నారా? అన్నది అటుంచితే.. మొత్తం మీద కవిత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా తన పార్టీలోకి ఆహ్వానించారు. తమ జాగృతి పార్టీకి నేషనల్ కన్వీనర్ గా చేస్తామంటున్నారు.
ఇదంతా ఇలా ఉంచితే.. మాజీ మంత్రి హరీష్ రావును గుంట నక్కతో పోల్చడం అన్నది ఆమెకున్న జన్మహక్కు. ఎందుకంటే ఆయన కవితకు వరస కుదిరే బంధువు అవుతారు. బావా బావా పన్నీరు- బావను పట్టుకు తన్నీరు అంటూ ఆమె యధేచ్చగా చెలరేగిపోవచ్చు. ఆయన కూడా ఏమీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే తనకింతటి రాజకీయ హోదా, పలుకుబడి, అపారమైన సిరిసంపదలకు కారణమైన మేనమామ కేసీఆర్ తనయ కాబట్టి.. పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తారు. కవిత ఎన్ని అన్నా హరీష్ పల్లెత్తి మాట్లాడ్డానికి వీల్లేని పరిస్థితి.
అయితే రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా ఆయన ఎప్పుడో అన్న మాటను అనుసరించి గుంపు మేస్త్రీ.. గుంపు మేస్త్రీ.. అని దెప్పి పొడవడమే ఏమిటీ? అన్న ప్రశ్నకు సమాధానం శోధిస్తూ వెళ్తే.. ఇక్కడ కూడా మనకో లింకు తగులుతుంది. ఇటీవల కవిత కాంగ్రెస్ లోకి గానీ వెళ్తారా? అనే టాక్ వినిపించింది. దీనికి విరుగుడుగా తనకు కాంగ్రెస్ లోకి వెళ్లే యోచన లేదు.. సొంత పార్టీ పెట్టడమే తన ధ్యేయం అన్న సంకేతాలను ఇవ్వడంలో భాగంగా.. ఆమె సీఎం రేవంత్ను గుంపు మేస్త్రీగా పోలుస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. తన బావను గుంట నక్క అని సంబోధిస్తూ.. తద్వారా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్లడం కాదు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నే తన పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ను జాతీయ కన్వీనర్ చేస్తానంటూ ఆమె అనడం చూస్తుంటే.. ఇదంతా తెలంగాణ రాజకీయ రామాయణంలో.. కవితక్క పిడకల వేటగా కామెంట్లు చేస్తున్న వారున్నారు. ఏది ఏమైనా.. కవిత తగ్గేదే లే అంటూ ముందుకెళ్తూనే వస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-25-213021.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.