కాంగ్రెస్’లో చేరికల చిచ్చు.. రేవంత్ వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్

Publish Date:Jul 8, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి ... చేరికలతో పాటుగా నిరసన స్వరాలు, వ్యతిరేక నినాదాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంత కాలంగా కొంత  గుంభనంగా  ఉన్న విబేధాలు భగ్గు మంటున్నాయి.

ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంతవరకు ఆయన పార్టీపై పట్టు సాధించ లేక పోయారు. పీసీసీ కుర్చీలో కుదరుగా కూర్చున్నది లేదు, అందుకే పార్టీలో విబేధాలు రోజు రోజుకు పై మెట్టుకు చేరుతున్నాయే, తప్ప దిగిరవడం లేదని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు.   ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలు రేపుతున్న చిచ్చు విషయానికి వస్తే, పైన అనుకున్న విధంగా ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది.

తాజాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ నేత  మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ని, సగౌరవంగా పార్టీలోకి స్వాగతించారు. ఎర్ర శేఖర్ తో పాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్’లో సందడి చేశారు. కానీ, ఆ  సందడి పూర్తిగా సర్డుమణగక ముందే ఎర్ర శేఖర్ చేరికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల విమర్శలు మొదలయ్యాయి. నేర చరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు, అంటూ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బహిరంగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తప్పుపట్టారు.

అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతే కాదు, ఎర్ర శేఖర్ ఎంట్రీ పై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అదలా ఉంటే కొంతకాలం వెనక్కి వెళితే, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే వడ్డేపల్లి రవి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని 2018 ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని, సస్పెన్షన్ ఎత్తివేయకుండా, మళ్ళీ పార్టీలోకి ఎలాతీసుకుంటారని రేవంత్ రెడ్డి వర్గం, కోమటి రెడ్డిని తప్పు పట్టింది.

అంతేకాదు, మర్యాద పూర్వకంగా పీసీసీ చీఫ్ కు కలిసేందుకు ఇంటికొచ్చిన వడ్డేపల్లి ముఖం మీదనే రేవంత్ రెడ్డి తలుపులు వేశారు. రవిని రేవంత్ కలవలేదు. గేటు బయటి నుంచే వెనక్కి పంపించేశారు. ఇంకొంత వెనక్కి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ, తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అలిగి కూర్చున్నారు.  అలాగే,ఇటీవల సీఎల్పీ మాజీ నేత, పీజేఆర్ కుమార్తె, తెరాస కార్పొరేటర్ విజయా రెడ్డి, మళ్ళీ సొంత గూటికి చేరారు.

పీసీసే చీఫ్ రెంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన రెడ్డి మాత్రం, సోదరి చేరికను గట్టిగానే వ్యతిరేకించారు. తన సోదరి కాంగ్రెస్ పార్టీలో  చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ తనతో చర్చించలేదన్నారు. అంతే కాకుండా, రెంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను లంచ్ కి ఆహ్వానించి సమాలోచనలు జరిపారు. సోదరి విజయా రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన సీనియర్లతో సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నేపధ్యంలోనే, ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, పార్టీలో చేరుతున్న ఎవరికీ, టికెట్ హామీ ఇవ్వడం లేదని ప్రకటించారు. అయితే, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కుర్చీలో ముందుగా   కర్చీఫ్ వేసేందుకే, సీనియర్లను పక్కన పెట్టి, ఇతర పార్టీలలో తనకు మద్దతుగా నిలిచే వారిని ఏరి కోరి పార్టీలో చేర్చుకుంటున్నారని,సీనియర్ నేతలు అనుమానిస్తున్నారు.

అందుకే కావచ్చును, రేవంత్ రెడ్డి తాజాగా, సోనియా గాంధీ ఎవరి పేరు చెపితే వారిని, పల్లకీలో భుజాన మోసుకెల్లి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెడతానని ప్రకటించవలసి వచ్చిందని అంటున్నారు. నిజానికి, ఒక్క చేరికల విషయంలోనే కాదు, ఇతరత్రా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ అన్న విధంగానే ఇతర సీనియర్ నాయకుల ప్రవర్తన ఉంటోంది. ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో  నిర్వహించిన చింతన శిబిర్ లో  ఆమోదించిన తీర్మనాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం, రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్వర్యంలో జూన్ 1 నుంచి రెండు  రోజులు హైదరాబద్’లో రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించింది. అలాగే, గతంలో రేవంత్ రెడ్డి,  రెడ్డి సామాజిక వర్గానికి పగ్గాలను అప్పగిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటీవల ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు ఏవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, గోడకేసి కోడతానంటూ చేసిన వ్యాఖ్యలు  కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి.  

ఇదలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంకా ఆయన పార్టీఫై పూర్తి పట్టును సాధించలేక పోయారు. సీనియర్లతో సయోధ్యత ఎండమావిగానే మిలిపోయింది. మరో వంక అయన దూకుడు పెంచిన కొద్దీ, పార్టీలో వ్యతిరేకత అదే స్థాయిలో పెరుగుతోంది,  ఎదురు తిరుగుతోంది. మరోవంక రేవంత్ రెడ్డి సారధ్యంలో  జరుగుతున్న చేరికలు ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకునేందుకు పనికోస్తాయే తప్ప పార్టీ ఇమేజ్ ని పెంచేందుకు ఏ మాత్రం పనికొచ్చేవి కాదని, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

నిజానికి, పార్టీలో కొత్తగా చేరుతున్న నేతల వలన నియోజకవర్గ స్థాయిలో సమస్యలు, తిరుగుబాట్లు ఎదురయ్యే  ప్రమాదం ఉందని అంటున్నారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చేరికతో, గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిండ్ దాసోజు శ్రవణ్  పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మరో వంక, రేవంత్ రెడ్డికి మొదటి నుంచి దూరంగా ఉంటున్న పీజేఆర్ కుమారడు విష్ణు వర్దన్  రెడ్డి రేపు ఏమి చేస్తారో .. తెలియదు. మొత్తానికి కాంగ్రెస్ లో చేరికల సందడిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీలో చేరికలు చిచ్చుపెడుతున్నాయి అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోందని రాజకీయ పండితులు విశ్లేస్తిస్తున్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి పార్టీ పాలిట మరో సిద్దూ అవుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.