సినిమా క్యాసెట్లతో వచ్చింది... సినిమా స్టైల్లోనే ఎదిగింది!

Publish Date:Feb 6, 2017

Advertisement

శశికళ... శశికళ.. శశికళ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కలకలం! జయలలిత స్నేహితురాలిగా నిన్న మొన్నటి వరకూ వార్తల్లో వున్న ఆమె ఇప్పుడు కాబోయే సీఎం! అమ్మ తరువాత చిన్నమ్మగా తమిళ ప్రజలకి మాతృ ప్రేమ పంచబోతోంది! కొందరు ఓకే అన్నా, కొందరు నాట్ ఓకే అన్నా, కొందరు అస్సలు కుదరదు అన్నా శశికళ తన రూట్లో తాను సెక్రటేరియట్ కి దారితీస్తోంది. అయితే, ఈ శశికళ ఎవరు? ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అమ్ముకున్న ఆమె ఇవాళ్ల చెన్నై రాజకీయాల్లో వీరనారిగా ఎలా అవతరించగలిగింది? తెలుసుకుంటే ఆశ్చర్యకరం కలగకమానదు!

 


శశికళ తాత తంజావూరులో నాటు వైద్యుడు. ఆయన కొడుకు వివేకానందన్. అతనో ఆల్లోపతి మందుల దుకాణం నడిపేవాడు. అందుకే, శశికళ కుటుంబాన్ని తంజావూరులో ఇంగ్లీషు మందుల దుకాణం వాళ్లు అనేవారు. అలా మెడికల్ షాపు నడిపే వివేకానందన్ కి జన్మించిన ఐదో సంతానమైన శశికళ నటరాజన్ ను పెళ్లి చేసుకుంది. ఆయన తమిళనాడు ప్రభుత్వంలోని పౌర సరఫరాల శాఖలో అధికారి. అదే జయలలిత వైపుకి శశికళ అడుగులు పడేలా చేసింది!

 


జయలలిత అన్నాడీఎంకేలో చేరగానే ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేసిన ఎంజీఆర్ ప్రచార కార్యదర్శిగా కూడా నియమించారు. ఆ బాధ్యతల్లో భాగంగా జయలలిత కడలూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు స్థానిక కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. తరువాత చంద్రలేఖే జయకు సహాయకురాలుగా నియమింపబడింది. అలా వారిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. కాని, తనకు తెలియకుండానే కలెక్టర్ చంద్రలేఖ ఓ చారిత్రక కలయికకి పునాది వేసింది! ఆమె తనకు అప్పటికే పరిచయం వున్న గవర్నమెంట్ అధికారి నటరాజన్ను, ఆయన భార్య శశికళను జయకు పరిచయం చేసింది. శశికళకు అప్పటికే వీడియో క్యాసెట్ల దుకాణం వుండటంతో జయలలిత ఆమెతో ఇంగ్లీషు సినిమాలు తెప్పించుకుని చూస్తూ వుండేది! అదే వారిద్దరి మధ్యా ప్రగాఢమైన అనుబంధానికి దారితీసింది! అసలు ఒక దశలో వాళ్లిద్దరూ ఓ గుడిలో దండలు మార్చుకుని పెద్ద దుమారమే రేపారు!

 


1989 వరకూ ఆషామాషిగా నడిచిన అమ్మ, చిన్నమ్మల ఫ్రెండ్ షిప్ అప్పట్నుంచీ కొత్త పుంతలు తొక్కింది. శశి ఏకంగా జయ ఇంట్లోకే మకాం మార్చింది. ఇద్దరూ ఒకర్ని వదిలి ఒకరు వుండటమే మానేశారు. జయలలిత తన రక్త సంబంధీకులందర్నీ దూరం పెట్టేసింది. శశికళే తన తోడు, నీడ అనుకుంది. శశికళ కూడా స్లోగా జయ జీవితాన్ని తన ప్రభావంతో నింపేసింది. ఆఖరుకు ఆమె ప్రఖ్యాత పోయెస్ గార్డెన్ ఇంట్లో పని వారు కూడా శశికళ భర్త ఊరైన మన్నార్ గుడి నుంచే వచ్చేవారు!

 


శశికళ పూర్తిగా జయ ప్రపంచంపై పట్టుబిగిస్తున్న కాలంలోనే ఎక్కడో బెడిసి కొట్టింది. అమాంతం పురుచ్చి తలైవీ ఆమెని, ఆమె కుటుంబాన్ని ఇంట్లోంచి గెంటేసింది. దీనికి కారణం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి , ప్రస్తుత ప్రధాని అందించిన సమాచారమే అంటారు. జయకు తెలియకుండా ఆమె చుట్టూ శశికళ , ఆమె కుటుంబం గొయ్యి తోవుతున్నారని మోదీ చెప్పాడంటారు. ఆయనకు వున్న ఇంటలిజెన్స్ సమాచారాన్ని నమ్మిన జయలలిత శశికళ, ఆమె కుటుంబం ... ఉరఫ్ , మన్నార్ గుడి మాఫియాను పోయెస్ గార్డెన్ లోంచి బయటకు పంపింది.

 

 

కాని, మూడు నెలల్లోనే శశికళ కాళ్లు పట్టుకుని బతిమాలి తిరిగి స్నేహితురాలి పంచన చేరింది. అదే జయ చేసిన ఆఖరి తప్పని కొందరంటారు. ఆ విషయం ఎలా వున్నా శశికళ తిరిగి వచ్చాక క్రమంగా జయమ్మ ఆరోగ్యం క్షీణించింది. అపోలో హాస్పిటల్లో అంతిమ ఘడియలు గడిచిపోయాయి. అప్పుడు కూడా ఆమె పక్కన శశికళ తాను వుందే తప్ప ఎవ్వర్నీ దగ్గరకు రానీయలేదు! అమ్మ జీవితాన్ని చిన్నమ్మ శాసించిందా? చెప్పలేం. కాని, ఆమె జీవితాన్ని మాత్రం ఈమె ఖచ్చితంగా ప్రభావితం చేసింది! 

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.