జ‌యా బ‌చ్చ‌న్‌ అగ్గిమీద‌ గుగ్గిలం!

Publish Date:Sep 16, 2020

Advertisement

జ‌యాబ‌చ్చ‌న్‌..డెబ్బ‌య్ రెండేళ్ల రాజ్య‌స‌భ స‌భ్యురాలు..అంటే పెద్ద‌ల స‌భ‌లో స‌భ్యురాల‌న్న మాట‌. అంటే ఆమె ఏమి చెప్పినా పెద్ద‌రికంతో చెప్పిన‌ట్ట‌న్న‌మాట‌! పెద్ద‌రికంతో చెప్పాలి కాబ‌ట్టి..క‌నీసం అలా చెప్పిన‌ట్ట‌యినా అనిపించాలి కాబ‌ట్టేమో ఆమె ఆచితూచి మాట్లాడుతుంటారు. ఆమాట‌కొస్తే ఆచితూచే స‌భ‌కూ వ‌స్తుంటారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ఏదైనా చెప్పాల‌నుకున్న‌ప్పుడే స‌భ‌కు వ‌స్తుంటార‌ని అనుకునేవాళ్లూ ఉన్నారు! అలానే మంగ‌ళ‌వారం నాడు స‌భ‌కి వ‌చ్చారు. ఆమె వ‌చ్చారంటే ఏదో పెద్ద విష‌య‌మే ఆమె మాట్లాడ‌తార‌ని అనుకోవ‌చ్చు. అలాగే ఒక పెద్ద విష‌య‌మే లేవ‌నెత్తారు. ఏదో కొంద‌రి కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ,భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ మీద అగ్గిగుగ్గిల‌మే అయ్యారు. సినీ ప‌రిశ్ర‌మ అన‌గానే సోష‌ల్ మీడియా ఒంటికాలికి మీదికి లేస్తుంద‌ని, ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు వీస‌మెత్తు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.

 

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం చెల‌రేగి సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ఆమె ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటున్న‌ది. మాద‌క ద్ర‌వ్యాల‌ను ఎవ‌రో కొంద‌రు వాడుతున్నంత మాత్రాన మొత్తం ప‌రిశ్ర‌మ‌నే వేలెత్తి చూపుతారా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. అంత సీనియ‌ర్ స‌భ్యురాలు స‌భ‌లో ఈ అంశాన్ని ఈ కోణంలో ప్ర‌స్తావించ‌డాన్ని సినీ అభిమానులు ఏమాత్రం జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని డ్ర‌గ్స్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసి ఉంటే యావ‌త్ ప్ర‌జానీకం సంతోషించి ఉండేవారు. సుశాంత్ లాంటి యువ‌త‌రాన్ని బ‌ల‌గొంటున్న డ్ర‌గ్స్ మాఫియా ఊసెత్త‌కుండా దాన్ని ఎవ‌రో కొంద‌రికే ప‌రిమిత‌మైన అంశంగా ఆమె భావించ‌డం రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఆమె స్ధాయికి త‌గిన‌ట్టుగా లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మ‌రో న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే కొంద‌రి పేర్లు ప్ర‌స్తావించి, వారు ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని ఇచ్చిన పిలుపికి జ‌యాబ‌చ్చ‌న్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఇక్క‌డ గుర్తించాల్సిన అంశం. కంగ‌నా ర‌నౌత్ బ‌హిరంగంగా పేర్లు ప్ర‌స్తావించిన‌ప్పుడు యావ‌త్ బాలీవుడ్ మౌన‌మే వ‌హించింది. అంటే దాన‌ర్ధం ఏమిటి? ఆ పెద్ద‌వాళ్ల గొడ‌వ‌లో వేలు పెట్ట‌డం ఇష్టం లేద‌నా? లేక కంగ‌నా లేవ‌నెత్తిన అంశంలో వాస్త‌వం ఉంద‌నా? ఇంకా చెప్పాలంటే సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ మాఫియా గురించి కంగ‌నాయే ధైర్యంగా నోరెత్తింది. ఆమెకి త‌గినంత మ‌ద్ద‌తు రాలేదు. 

 

ఇంక మ‌రో విష‌యం. కంగ‌నా ర‌నౌత్ ముంబాయి ఆఫీసు వివాదాస్ప‌ద‌మై ఇర‌వై నాలుగ్గంట‌ల్లో ముంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆమె ఆఫీసు భ‌వ‌నంలో కొంత భాగాన్ని ఆగ‌మేఘాల మీద కూల్చివేసిన‌ప్పుడూ జ‌యాబ‌చ్చ‌న్ నోరు మెద‌ప‌లేదు. మ‌రి కంగ‌నా ర‌నౌత్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌గా ఎదిగింది. త‌న‌కంటూ సొంత వ్య‌క్తిత్వంతో బాలీవుడ్‌లో నిల‌బ‌డింది. అటువంటి న‌టికి సంఘీభావంగా నిల‌బ‌డాల్సిన స్ధాయిలో ఉండి కూడా జ‌యాబ‌చ్చ‌న్ అస‌లా అంశం త‌న‌కు సంబంధించ‌నిదిగానే వ్య‌వ‌హ‌రించారు. కంగ‌నా ర‌నౌత్ మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వంతోనే యుద్దానికి త‌ల‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే కుమారడు ఆదిత్య థాక్రేకు మాద‌క ద్ర‌వ్యాల మాఫియాతో లింకులు న్నాయ‌ని ఆమె నేరుగా ఆరోపించారు. అయితే అది ప్ర‌భుత్వంతో ముడిప‌డి ఉన్న అంశం అయినందున జ‌యాబ‌చ్చ‌న్ ఆ విష‌యం జోలికి వెళ్ల‌లేదు. నిజానికి రాజ్య‌స‌భ‌లో ఆమె ఈ అంశాన్ని కూడా ప్ర‌స్తావించి ఉండాల్సింది. ద‌ర్యాప్తుకి డిమాండ్ చేసి ఉండొచ్చు. కంగ‌నా ర‌నౌత్ మీద రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని నిలువ‌రించాల‌ని గొంతెత్తి ఉండాల్సింది. కాని ఇవేమీ జ‌ర‌గ‌లేదు. సినీ ప‌రిశ్ర‌మ గురించి ఒక సినీ న‌టుడే అలా మాట్లాడ‌టం శోచ‌నీయం అంటూ ర‌వి కిష‌న్ వ్యాఖ్య‌ల గురించి ప్ర‌స్తావించారు. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ తీవ్ర‌త గురించి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ప్ర‌సారం చేస్తున్న ప్ర‌సార మాధ్య‌మాల‌ను ఆమె త‌ప్పుబ‌డుతున్నారు. 

 

జ‌రుగుతున్న వాస్త‌వాల‌ను అర‌చెయ్యి అడ్డుపెట్టా ఆపాల‌ని ఆమె భావిస్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. సుశాంత్ మ‌ర‌ణం కేసు ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌దో ఆమెకి తెలీద‌ని అనుకోలేము. అలా మ‌లుపులు తిర‌గ‌డంలోని ఉచితానుచితాల గురించీ ఆమెకు ప్రాథ‌మిక స‌మాచారమైనా తెలీద‌నీ భావించ‌లేము. సుశాంత్ కేసులో అది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తేల్చాల్సిన త‌రుణంలో కేసు ఆ ప‌రిధిని ఎప్పుడో దాటిపోయిన‌ట్టు అనిపిస్తున్న‌ది. ఎందుక‌లా జ‌రిగిందో ఎవ్వ‌రూ అడ‌గ‌డం లేదు. ఇప్పుడ‌ది మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కం ద‌గ్గ‌ర‌కొచ్చి రియాను, ఆమె సోద‌రుణ్ని అరెస్టు ఘ‌ట్టం ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి ఆపింది. ఇన్ని మ‌లుపుల నేప‌థ్యంలో జ‌యాబ‌చ్చ‌న్ సినీప‌రిశ్ర‌మ ద‌య‌నీయ‌ప‌రిస్థితి గురించి ఆందోళ‌న ప‌డ‌టం క‌న్నా, నిజానిజాల వెలికితీత‌కు ప‌ట్టుబ‌ట్టి ఉండాల్సింది!

-రాజా రామ్మోహ‌న్ రాయ్‌

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.