ఏపీలో మరింత బలోపేతానికి జనసేన వ్యూహం.. వైసీపీ మహిళానేతలే టార్గెట్?!

Publish Date:Jun 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రానున్న కాలంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే  గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై  ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.  ఆ పార్టీకి చెందిన కీలక  మహిళా నేతలను జనసేనలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది.  రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతున్న చర్చ మేరకు.. 

ఇటీవల పార్లమెంట్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు  కారణంగా కనిపిస్తున్నాయి. గత నెలలో పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చట్టసభల్లో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ అవసరమైన తరుణంలో లోక్‌సభలో  ఈ బిల్లుల ఆమోద ప్రక్రియలో  ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే దీనిని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్లమెంటు ఆమెదం పొందేందుకు ఈ బిల్లులను ఈ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లులు ఇమోదం పొందితే చట్ట సభల్లో స్థానాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకు కేటాయించే స్థానాలను దక్కించుకునే వ్యూహంతో జనసేన వైసీపీ మహిళా నేతలకు తమ పార్టీ తలుపులు బార్లా తెరవాలని నిర్ణయానికి వచ్చినట్ల జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.  

ఈ వ్యూహంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ..  క్షేత్రస్థాయిలో  పట్టున్న మహిళా నేతలను గుర్తించిందని చెబుతున్నారు. వారిలో  వైసీపీలో సరైన ప్రాధాన్యత లేక,  అసంతృప్తితో ఉన్న పలువురు మాజీ మహిళా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇప్పటికే జనసేన వర్గాలు  సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.  మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే..  రిజర్వ్ అయ్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్న ఉద్దేశంతో  జనసేన వారికి టికెట్లు ఆఫర్ చేయడం ద్వారా పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.  

అలాగే డీలిమిటేషన్ కూడా ఏపీ రాజకీయాల్లో  మార్పులకు దోహదపడనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ముందస్తుగా పట్టు సాధించడం అన్ని పార్టీలకూ అనివార్యంగా మారింది. ఈ పునర్విభజన సమయంలోనే మహిళా రిజర్వేషన్ల కోటాను కూడా అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో, జనసేన పార్టీ ఈ  స్ట్రాటజీని తెరపైకి తెచ్చిందంటున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత వైసీపీలో పలువురు మహిళా నేతలు సైలంట్ అయ్యారు.  ఇప్పుడు జనసేన అటువంటి వారిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.  ఇందుకు వారి నుంచి కూడా సానుకూలత వ్యక్తమౌతోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కూటమి హవా,    భవిష్యత్  రాజకీయ అవకాశాల దృష్ట్యా పలువురు వైసీపీ మహిళా నేతలు..  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.