Publish Date:Dec 29, 2023
సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు వైసీపీలో వలసల పర్వానికి తెరలేపిందా? అంటే జరుగుతున్నపరిణామాలను బట్టి ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే పార్టీలో అసమ్మతి బహిర్గతమై.. అసంతృప్తి తారస్థాయికి చేరి.. తిరుగుబాటుకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో జగన్ అండ్ కో ఎమ్మెల్యేలను బుజ్జగించి సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి. కొందరైతే తాడేపల్లి ప్యాలస్ పిలుపు అందుకున్నా ఏవో కారణాలు చెప్పి ముఖం చాటేస్తున్నారు. మరి కొందరైతే వచ్చే ఎన్నికలలో తాము పోటీకి దూరంగా ఉంటామని తేల్చి చెప్పేస్తున్నారు. మరి కొందరు అయిష్టంగానే అధిష్ఠానం మాటను ఔదాల్చుతున్నారు.
ఏది ఏమైనా ఎన్నికల ముందు వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన నియోజకవర్గ మార్పుపై బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వెళ్లారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో ఆయన శుక్రవారం (డిసెంబర్ 29) రాత్రి భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన కోసం కాకినాడ చేరుకున్న సంగతి తెలసిందే. పవన్ కల్యాణ్ బస వద్దకు జ్యోతుల చంటిబాబు శుక్రవారం (డిసెంబర్ 28) రాత్రి పదిన్నర గంటల సమయంలో చేరుకున్నారు. ఆయనతో పాటు దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా వారిరువురి మధ్యా అధికార వైసీపీ సిట్టింగులను స్థానాలు మార్చడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చిట్టి బాబును కూడా నియోజకవర్గం నుంచి మార్చేయడానికి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు తన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్ఠానాన్ని ధిక్కరించారు. జగన్ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు.
ఇప్పటికే జ్యోతుల చంటిబాబు వర్గీయులు పలువురు వైకాపాకు రాజీనామా చేశారు జ్యోతుల చంటి బాబు సైతం జగన్ తీరును నిరసిస్తూ త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబు పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaggampet-ycp-mla-jyothula-chantibabu-meet-39-167905.html
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.