జ‌గ‌న్ అడ్డుకోలు ఆట‌!

Publish Date:Oct 17, 2022

Advertisement

హీరోయిన్‌ని తీసికెళుతోన్న హీరోగారు, ఆయ‌న స్నేహ‌బృందాన్ని విల‌న్ అడ్డుకోవ‌డానికి అనేక మార్గాల్లో అడ్డంకులు క‌ల్పించ‌డం, ఒక‌టి రెండు దాడులు చేయుట‌..తీరిగ్గా త‌న్నులు తిని సుఖంగా హీరోహీరోయి న్లు వెళ్ల‌డానికి అడ్డంకులు తొల‌గించేయ‌డం..ఇదంతా సినీసీన్లు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల పాద‌ యాత్ర ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే య‌త్నం చేయ‌డం, యాత్ర‌కు మ‌ద్ద‌తుగా విప‌క్షాల మ‌ద్ద‌తును అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం  పోలీసుల‌తో అడ్డంకులు సృష్టిం చ‌డం, క‌ద‌ల‌నీయ‌కుండా చేసి వారితో వ‌చ్చి న వారిపై దాడులు చేయించి మ‌రీ భ‌య‌పెట్ట‌డం లాంటివి ఈమ‌ధ్య జ‌గ‌న్ స‌ర్కారుకి దిన‌చ‌ర్య‌గా మారింది. ఎవ‌ర‌న్నా ప్ర‌జోపయోగ ప‌నుల్లో బిజీగా ఉంటారు. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం విప‌క్షాల‌వారు వీధి చివ రికి వెళుతు న్నార‌ని తెలిసినా ఒక్క‌రిద్ద‌రు పోలీసుల‌నైనా పంపి వెన‌క్కి పంపే య‌త్నాలే చేస్తున్నారు. ఇది  పిరికి త‌నంతో కూడిన భ‌య‌మ‌నే అనుకోవాలి.  ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోయిన మ‌న‌స్తాపం ఈవిధంగా తీర్చుకుంటున్నార‌నే అనుకోవాలి. ఎందుకంటే మ‌హాపాద‌ యాత్ర చేస్తున్న రైతాంగానికి మద్ద‌తునివ్వ‌డానికి టీడీపీ యువ‌నాయ‌కులు ప‌రిటాల శ్రీ‌రామ్(అనంత‌ పురం), వంగ‌వీటి రాధా(విజ‌ య‌వాడ‌), గంటీ హ‌రీష్ (అమ‌లా పురం) వంటివారు ఆదివార‌మే రాజ‌మండ్రి చేరుకున్నారు. కాగా సోమ‌వారం ఉద‌యం పాద యాత్ర‌లో పాల్గొన‌డానికి బ‌య‌టికి  రాగానే వీరితో పాటు టీవీ5 చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడిని కూడా పోలీసులు ఊహించ ని విధంగా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయ‌ నీయ‌లేదు. 

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో రైతుల మ‌హాపాద‌యాత్ర రాజ‌మండ్రికి చేరుకోవ‌డాన్ని ప్రభుత్వం అడ్డు కునే య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ప్ర‌శాంతంగా పాద‌యాత్ర చేస్తున్న రైతాంగాన్ని నిలువ‌రిం చేందు కు రాజ‌మండ్రి రోడ్డు క‌మ్ రైలు బ్రిడ్జి మీద రాక‌పోక‌లు నిషేధించారు. రిపేరు పేరుతో వారం రోజులు తిర‌గ రాద‌ని నిషేధా జ్ఞ‌లు అమ‌లుచేస్తున్నారు. అయినా త‌మ పాద‌యాత్ర ఆగే ప్ర‌సక్తి లేద‌ని రైత‌లు అంత‌కు మించి ధీటుగా స‌మాధానం ఇచ్చారు. వారికి సంఘీభావం తెలియ‌జేస్తూ పాద‌యాత్ర‌లో అడుగు క‌లిపేం దుకు, వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు టిడిపీ నాయ‌కులు రాజ‌మండ్రి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అడుగు ముందుకు వేయ‌నీయ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. 

పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల  అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీ సులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క రించి వెళ్లిపోవాల‌ని లేకుంటే  అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క సారిగా వేడెక్కింది. 

ప్ర‌జానిర‌స‌న‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం విశ్వ‌య‌త్నాలు చేస్తోందే గాని, ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు కార‌ణ‌మైన పాల‌నా విధానాల్లో మార్పులు చేర్పుల‌కు మాత్రం స‌సెమిరా అంగీక‌రించ‌డం లేదు. మూడేళ్లపాల‌న‌లో ప్ర‌జాహితంగా చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకున్న ఏ ఒక్క కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేదు. పైగా తీవ్ర నిర‌స‌న వెల్లువెత్తుతోంది. దీన్ని భ‌రించ‌లేక‌నే జ‌గ‌న్ స‌ర్కార్   రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను నిలువ‌ రించడంలో విప‌క్షాలమీద దుమ్మెత్తిపోయ‌డం, వారిని మాట్లాడ‌నీయ‌కుండా చేయ‌డం, అడ్డుకోవ‌ డం, అరెస్టుల భ‌య‌పెట్ట‌డాలు చేయ‌డం విప‌క్ష‌పార్టీల కార్య‌క‌ర్త‌లపై లాఠీ ఝుళిపించి అరెస్టులు చేయ‌డా ల‌కు పూనుకుం టోంది. 

అమ‌రావ‌తి రాజ‌ధానిని చేయ‌కుండా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కి తేవ‌డంతోనే విప‌క్షాలు మండిప‌డ్డాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర కు టీడీపీ తో పాటు విప‌క్షాల‌న్నీ మ‌ద్ద‌తు నీయ‌డంతో అది మ‌రింత ఊపందుకుంది. దానికి కౌంట‌ర్‌గా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు వైసీపీ తెర‌లేపింది. అది గాలివాన‌గా మారింది. హైకోర్టులో తీర్పుపై అస్పీలు చేసి స‌రిపెట్టుకోవ‌ల‌సి  వ చ్చింది. 

కానీ అమ‌రావ‌తి రైతులు మాత్రం పాద‌యాత్ర‌ను మహాపాద యాత్ర‌గా మార్చి క‌దం తొక్కారు. వారికి సంఘీ భావం ప్ర‌క‌టించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ కూడా  గ‌ట్టి మ‌ద్ద‌తే ఇ చ్చింది. ఈ నేప థ్యంలో వారి మ‌ద్ద‌తు యాత్ర‌ను కూడా  జ‌గ‌న్ సర్కార్ తీవ్రంగా అడ్డుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న పార్టీ నాయ కులు, అభిమానుల‌ను తిరిగి వెళిపోవాల ని పోలీసుల‌తోనే ప్ర‌తిఘ‌టించేలా చేసి దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌వ‌న్ బ‌స చేసిన హోట‌ల్‌కి వెళ్లి మ‌రీ అక్క‌డ ఉన్న ఇత‌ర జ‌న‌సేన నాయ‌కుల‌ను బ‌య‌టికి తీసుకు వ‌చ్చి మీకు అనుమ‌తి లేద‌ని అంటూ వారి ని వెన‌క్కి పంపిం చ డం జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తుంది.  జ‌గ‌న్‌కి తిండి తినే కంటే విప‌క్షాలను క‌ద‌ల‌కుండా ఎలాచేయాల‌న్న ఆలోచ‌నే ఎక్కువ యిం ద‌న డానికి ఈ సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం. 

స‌రిగా చ‌ద‌వ‌కుంటే పిల్ల‌ల్ని తండ్రి తిడ‌తాడు, ఆడ‌కుంటే కోచ్ తిడ‌తాడు, స‌రిగా పాల‌న చేయ‌కుంటే ప్ర‌జలు తిర‌గ‌బ‌డ‌తారు. కాదు పొమ్మంటే విప‌క్షాలు ఛ‌స్తే ఊరుకోవు. ప్ర‌తిఘ‌టిస్తాయి, ఉద్య‌మిస్తాయి కాద‌ని అడ్డుకునే వ్యూహాలు ఎన్ని పారించే య‌త్నాలు చేసినా ఫ‌లితం శూన్య‌మే. జ‌గ‌న్ ఎంత ఆలోచిం చినా అడ్డు కోవ‌డాలు, పోలీసుల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ప్ర‌జాభీష్టంగా ముంద‌డుగు వేయ‌డం దుర్ల‌భం.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.